Publish Date:Oct 25, 2024
ఫార్ములా ఈ రేస్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . గత బిఆర్ ఎస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరించింది . హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్ లో ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయమే రాకపోగా 55 కోట్ల రూపాయలను నిర్వహణ సంస్థకు ముట్ట జెప్పాల్సి వచ్చింది. ఈ కుంభకోణాన్ని వెలికి తీసింది ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ అని ఆయన వెల్లడించారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ అంటే రాష్ట్రానికి లాభం ఉండదు . కేవలం నిర్వాహకులకు మాత్రమే ఉంటుంది. అప్పట్లో అధికారంలో ఉన్న కెటీఆర్ ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ . తన బావమరిదికి చెందిన నిర్వహణ సంస్థకే ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్ట్ అప్పగించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేయడానికే ఈ ప్రాజెక్ట్ అని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. నిరుడు ఫిబ్రవరి 11న ఒక దఫా ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఈ యేడు ఫిబ్రవరి లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దయ్యింది . ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అప్పటి మున్సిపల్ మంత్రి కెటీఆర్ కనుసన్నల్లో జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారు అరవింద్ కుమార్ ఆఘ మేఘాల మీద నిర్వహణ సంస్థకు 55 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు . కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరవింద్ కుమార్ కు మెమో ఇచ్చింది . కెటీఆర్ ఆదేశాలమేరకే 55 కోట్ల రూపాయలను ఈ ఫార్ములా రేస్ నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అవినీతి నిరోధక శాఖ ను విచారణ జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-race-trap-is-the-formula-that-is-tightening-ktr-neck-39-187370.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.