Publish Date:Aug 17, 2022
మంచి కలర్ఫుల్ కార్డు, అంతకుమించి కళ్లను ఇట్టి కట్టిపడేసే బంగ్లా బొమ్మ చూడంగానే ఢామ్ పడేసేట్టు ఉంటుంది. కార్డు ఫోర్డు తెరవగానే అది ఎక్కడున్నదీ చుట్టుపక్కలేమున్నదీ అన్నివివరాలూ ఉంటాయి. చూస్తున్నంతసేపూ సదరు రిప్రజంటేటివ్ కామెంట్రీతో ఊదరగొడతాడు.. ఇదీ రియల్ ఎస్టేట్ వారి ప్రచార పద్ధతి. కొనబోతే జీవితంలో ఏదో నష్టపోతారన్న స్థాయిలో భయపెడతారు.
ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రచారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిపోతున్నాయి. అదీ ఒక్క ఫ్లాట్ లేదా విల్లా గురించిన హడావుడి. కానీ చిత్రంగా ఏకంగా ఒక దీవి కోసమూ ఇదే స్థాయి ప్రచారం జరుగుతోంది. కేవలం మూడు కోట్లు చెల్లిస్తే ప్లడ్డా ఐలెండ్ మీ సొంతం అంటున్నారు!
ఈ ద్వీపంలో ఐదు బెడ్రూమ్ల ఇల్లు ఉంది, ఒక హెలిపాడ్, ఒక లైట్ హౌస్ ఉంది. ఇదేమీ ఈమధ్య నాటి ది కాదు. ఏకంగా 1790ల్లోది! ఎంతో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉన్న ఈ ద్వీపం ఖరీదు ముంబైలో 3 బి హెచ్కె ఖరీదు కంటే తక్కువేనట! మొత్తం 28 ఎకరాల ఈ ద్వీపం చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంది. ఎవరూ ఇక్కడికి వెళ్లడం, ఉండటం జరగలేదు. అయితే ముప్పయ్యేళ్ల క్రితం దీన్ని ఆరాన్ ఎస్టేట్ వారు అమ్మేశారు. దీన్ని డెరిక్, సాలీ మార్టన్ అనే డిజైనర్లు కొన్నారు.
కనుక ప్రస్తుతం వారిద్దరూ దీని యజమా నులు. ఈ ద్వీపం సరిగ్గా గ్లాస్గో నుంచి 31 మైళ్ల దూరంలో ఉంది. ఆర్డొస్సాన్ నుంచి పడవలో ఇక్కడికి చేరు కోవచ్చు. ఈ ద్వీపంలో వందకు పైగా రకాల పక్షలు ఉన్నాయి. కాగా లైట్ హౌస్ని 1990 నుంచి ఎడిన్బర్గ్ నిర్వహిస్తోందిట. పురాతనపద్దతిలో అద్దం, నూనె దీపం తీసేసి వాటి స్థానంలో సోలార్ శక్తి తో నడిచే ఎల్ ఇ డి లైట్లు అమర్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-island-costs-rs3-crores-39-142093.html
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.
నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? గెలిచే అభ్యర్థులు ఎవరు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరిలో నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా..? చంద్రబాబు సీఎం సీటును అదిరోహించబోతున్నారా? ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు..? అనే విషయాలపై ఏపీ ప్రజల్లోనేకాదు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.