Publish Date:Aug 17, 2022
మంచి కలర్ఫుల్ కార్డు, అంతకుమించి కళ్లను ఇట్టి కట్టిపడేసే బంగ్లా బొమ్మ చూడంగానే ఢామ్ పడేసేట్టు ఉంటుంది. కార్డు ఫోర్డు తెరవగానే అది ఎక్కడున్నదీ చుట్టుపక్కలేమున్నదీ అన్నివివరాలూ ఉంటాయి. చూస్తున్నంతసేపూ సదరు రిప్రజంటేటివ్ కామెంట్రీతో ఊదరగొడతాడు.. ఇదీ రియల్ ఎస్టేట్ వారి ప్రచార పద్ధతి. కొనబోతే జీవితంలో ఏదో నష్టపోతారన్న స్థాయిలో భయపెడతారు.
ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రచారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిపోతున్నాయి. అదీ ఒక్క ఫ్లాట్ లేదా విల్లా గురించిన హడావుడి. కానీ చిత్రంగా ఏకంగా ఒక దీవి కోసమూ ఇదే స్థాయి ప్రచారం జరుగుతోంది. కేవలం మూడు కోట్లు చెల్లిస్తే ప్లడ్డా ఐలెండ్ మీ సొంతం అంటున్నారు!
ఈ ద్వీపంలో ఐదు బెడ్రూమ్ల ఇల్లు ఉంది, ఒక హెలిపాడ్, ఒక లైట్ హౌస్ ఉంది. ఇదేమీ ఈమధ్య నాటి ది కాదు. ఏకంగా 1790ల్లోది! ఎంతో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉన్న ఈ ద్వీపం ఖరీదు ముంబైలో 3 బి హెచ్కె ఖరీదు కంటే తక్కువేనట! మొత్తం 28 ఎకరాల ఈ ద్వీపం చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంది. ఎవరూ ఇక్కడికి వెళ్లడం, ఉండటం జరగలేదు. అయితే ముప్పయ్యేళ్ల క్రితం దీన్ని ఆరాన్ ఎస్టేట్ వారు అమ్మేశారు. దీన్ని డెరిక్, సాలీ మార్టన్ అనే డిజైనర్లు కొన్నారు.
కనుక ప్రస్తుతం వారిద్దరూ దీని యజమా నులు. ఈ ద్వీపం సరిగ్గా గ్లాస్గో నుంచి 31 మైళ్ల దూరంలో ఉంది. ఆర్డొస్సాన్ నుంచి పడవలో ఇక్కడికి చేరు కోవచ్చు. ఈ ద్వీపంలో వందకు పైగా రకాల పక్షలు ఉన్నాయి. కాగా లైట్ హౌస్ని 1990 నుంచి ఎడిన్బర్గ్ నిర్వహిస్తోందిట. పురాతనపద్దతిలో అద్దం, నూనె దీపం తీసేసి వాటి స్థానంలో సోలార్ శక్తి తో నడిచే ఎల్ ఇ డి లైట్లు అమర్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-island-costs-rs3-crores-39-142093.html
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.