దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం ఇదే: ముఖేష్ కుమార్ మీనా 

Publish Date:May 15, 2024

Advertisement

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం..  ప్ర‌స్తుతం జ‌రిగి ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ శాతం గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే అత్య‌ధిక‌మ‌ని అన్నారు. ఉమ్మ‌డి ఏపీ, విడిపోయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఈ స్థాయి పోలింగ్ శాంతం న‌మోదుకాలేద‌ని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదైందనీ, ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ న‌మోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా పోలింగ్ శాతంలో అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 శాతం పోలింగ్ న‌మోదైంది. విశాఖప‌ట్నంలో అత్య‌ల్పంగా 68.63 శాతం పోలింగ్ న‌మోదైంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికంగా దర్శిలో 90.91 శాతం ఓటింగ్ న‌మోదైంది. అత్యల్పంగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 63.32 శాతం న‌మోదైంద‌ని ముఖేష్ కుమార్ తెలిపారు.ఉద‌యం, సాయంత్ర వేళ‌లో పోటెత్తిన ఓట‌ర్లు..
త‌మ ఓటు హ‌క్కును వినియోగించ‌డానికి ఉద‌యం, సాయంత్రం స‌మ‌యంలో ఓట‌ర్లు భారీగా కేంద్రాల‌కు త‌ర‌లివ‌చ్చారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో కాస్త నెమ్మ‌దించింది. పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు ఓటింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండ‌టంతో  మొత్తం 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటల వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింద‌ని తెలిపారు. ఓటింగ్ పూర్త‌యిన త‌ర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ ల‌కు తీసుకురావ‌డానికి కాస్త స‌మ‌యం ఆల‌స్యం అయిందన్నారు. దీనికి టెక్నిక‌ల్ ప్రాబ్లమ్స్,  పోలింగ్ ఆల‌స్యం కావ‌డం, వాతావ‌ర‌ణ ప్ర‌భావం, ప‌లు అనుకోని సంఘ‌ట‌న‌లు కార‌ణాలుగా ఉన్నాయ‌ని తెలిపారు. 
దేశంలోనే అత్యధిక ఓటింగ్ శాతం..
ఏపీ ఎన్నిక‌ల్లో న‌మోదైన ఓటింగ్ శాతం దేశంలోనే అత్య‌ధిక‌మ‌నీ, ఇది కొత్త రికార్డు అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల కోసం ఓటు హ‌క్కు ఉప‌యోగించుకున్న మొత్తం ఎలక్ట‌ర్స్  4,13,33,702 గా ఉన్నారు. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4,560 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్ లో పోస్టల్ బ్యాలట్ 4,44,216, హోం ఓటింగ్ 53,573 కాగా మొత్తం 4,97,789 (1.2 శాతం) గా నమోదైంది. మొత్తం ఓటర్లలో 1,64,30,359 మంది పురుషులు, 1,69,08,684 మంది మహిళా ఓటర్లు, 1517 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. గతంలో కంటే అధికంగా పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. ప్రస్తుత నాలుగు ఫేజ్ లలో దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో పోలింగ్ నమోదుకాలేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపాడు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచినట్టు వెల్లడించారు.

By
en-us Political News

  
రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రిగా రైల్వే శాఖ, పెమ్మసానికి వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడయితే వేలాదిమంది వైసీపీ నాయకులు కట్టుబట్టలు కూడా లేకుండా మిగిలారు. అలాంటివాళ్ళందరూ ఇప్పుడు జగన్ మీద ఎలాగూ ఆగ్రహం వ్యక్తం చేసే సీన్ లేదు కాబట్టి, ఆరా మస్తాన్ మీద ఆగ్రహంగా వున్నారు.
తాను పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ.. తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఆయన పేరు మారుమోగిపోతోంది.
ఏపీలో ఐదేళ్ల‌పాటు సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ప్రజ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. అడుగ‌డుగునా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. ఏపీలో ఐదేళ్ల‌పాటు సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ప్రజ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు....
జాతీయ స్థాయిలో తన పార్టీని మోయడానికి ఆ నలుగురు ఎంపీలైనా వున్నారని ఊరట చెందుతున్న జగన్మోహన్‌రెడ్డి వెంట ఇప్పుడు ఆ నలుగురు కూడా వుండరని అర్థమైపోయింది.
పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రమంత్రి అయ్యారు. ఈ కృతజ్ఞతను పెమ్మసాని శ్రీరత్న వ్యక్తం చేశారు. తన భర్త కారుకు తెలుగుదేశం జెండాను అమర్చి సెల్యూట్ చేశారు.
ఈ సర్వే కూటమి 164 స్థానాల్లో గెలుస్తుందని, వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని చెప్పింది. ఆ సర్వే పేరు ‘ఓపెన్ టాక్ సర్వే’.
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూరం ఫిక్సైంది. బుధవారం (మే12)న చంద్రబాబు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. తన కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టేశారు.
కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు వున్నారు. 10 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. అలాగే 18 మంది సీనియర్ మంత్రులు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. 
ఎన్నికలలో గతంలో ఎవరికీ దక్కనంత ఘోరమైన ఓటమి ఈ సారి జగన్ నాయకత్వంలోని వైసీపీకి దక్కింది. కనీసం ప్రతిపక్షహోదాకి కూడా నోచుకోని గొప్ప పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాలలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కూడా ఒకటి.
కేంద్రంలో ముచ్చటగా మూడో సారి నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువుదీరింది. మోడీ కేబినెట్ లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం (జూన్ 10)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.