చలికాలంలో ఉబ్బసం సమస్యకు ఇలా చెక్ పెట్టండి!

Publish Date:Jun 28, 2023

Advertisement

ఉబ్బసం అనేది శ్వాస సంబంధ సమస్య. ఈ సమస్య వచ్చిన వాళ్లలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. సాధారణ సమయంలో బాగానే ఉన్నా అతి చల్లని వాతావరణం ఉన్నప్పుడు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఉబ్బసం సమస్య ఎందుకు వస్తుంది అంటే.. 

వాతావరణ కాలుష్యం వల్ల, పీల్చే గాలి కలుషితమైపోయి శ్వాస కోశాన్ని దెబ్బతీయడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, నేటి కాలంలో కృత్రిమమైన జీవన విధానం వల్లా ఉబ్బసం వ్యాధి వస్తుంది. ఈ ఉబ్బసం వ్యాధినే ఆస్తమా అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ చలి కాలములో ఆస్తమా సమస్య ఉన్నవారు మరింత ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరు తీసుకునే ఆహారం, జీవనశైలి మొదలైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

జీవన శైలి..

రాత్రి ఎప్పుడో ఆలస్యంగా పడుకుని, ఉదయమేప్పుడో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక నిద్రలేవడం వంటి జీవన విధానాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయంతో పాటే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముఖం కడుక్కున తరువాత తేనె, తులసి రసం రెండింటిని సమానంగా కలిపి 10గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే 5గ్రాముల తేనె, 5 గ్రాముల తులసిరసం తీసుకోవాలి. 

నువ్వుల నూనె తీసుకుని శరీరమంతా పట్టించి బాగా మర్దన చేసుకుని సూర్యుడి లేత ఎండలో గడపాలి.

ఎండలో కొద్దిసేపు ఉన్న తరువాత ఒక బకెట్టు వేడి నీరు, ఒక బకెట్టు చల్ల నీళ్లు తీసుకోవాలి. ఈ నీటిని మొదట రెండు చెంబులు తల మీద, వీపు మీద పోసుకోవాలి. ఆ తరువాత చల్ల నీళ్లు తలమీద నుండి పోసుకోవాలి.  ఇలా మార్చి మార్చి నీటిని పోసుకుంటూ స్నానం పూర్తి చేయాలి. వేసవికాలంలో కూడా ఇదే విధంగా స్నానం చేయాలి. 

ఆస్తమా సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే :- 

ఆస్తమా సమస్య ఉన్నవారు తినే ఆహారం కఫం లేకుండా ఉండాలి. ముఖ్యంగా పులుపు, ఉప్పు, కారం మొదలైనవి ఎంత మానుకుంటే అంత మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు, దుంపలు మొదలైనవి మానుకోవాలి.  మత్తు మాదకద్రవ్యాలు, కాఫీ, టీలు, ఐస్ క్రీమ్లు చల్లని ఫ్రిజ్లో పెట్టినవి వాడరాదు. పంచదార, బెల్లము తగ్గించి వాడాలి. మలబద్దకం లేకుండా ఉండటానికి  అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి. దేహతత్త్యమును బట్టి ఆయా ఋతువులలో దొరికే పండ్లు వాడాలి. పాలు త్రాగాలంటే పిప్పలి, ధనియాలు శొంఠి పౌడరు చేసి డికాషన్ కలిపిన పాలు త్రాగాలి. మనం తినే ఆహారము ఎంత రుచిగా ఉన్నా చాలా తగ్గించి తినాలి. కడుపు నిండుగా అతిగా తినకూడదు. కడుపులో ఎప్పుడూ కాస్త కాళీ ఉండేట్టుగా తినాలి. ఎప్పుడూ ఆకలి కలిగిఉండాలి. చిరుతిండ్ల జోలికి వెళ్లకూడదు. 

వ్యాయామము:- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యనమస్కారములు చేయాలి. ఇలా  చేసినవారికి ఉబ్బసమే కాదు సమస్త వ్యాధులు నయమైపోతాయి.

                                                ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.