ఇది ప్రభుత్వ కుట్ర: అమరావతి జేఏసీ

Publish Date:May 10, 2023

Advertisement

అమరావతి భూములను పేదలకు దక్కకుండా చేయడంలో  ప్రభుత్వ కుట్రను 
అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జే ఏ సీ) నేత పువ్వాడ సుధాకర్ రావు బయట పెట్టారు.  రాజకీయ స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం వలన  ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రాజధాని అమరావతిలో ఉచితంగా ఇంటిని పొందే అవకాశాన్ని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందన్నారు.  వారికి శాశ్వతంగా రాజధానిలో నివాసాన్ని లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు.
‘‘అమరావతి రాజధాని లో గత ప్రభుత్వ హయాంలో 44 ఎకరాలలో 5024 అత్యంత మన్నిక గల, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లను నిర్మించడం జరిగినది అనగా ఒక ఎకరమునకు 114 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రస్తుతం 1134 ఎకరాలతో పాటు ఇప్పుడు అదనంగా కోరిన 268 ఎకరాలను కలుపుకొని మొత్తం 1402 ఎకరాలలో సుమారుగా 50వేల మందికి సెంటు భూమిని పంపిణీ చేస్తుంది. అనగా ఒక ఎకరం  35 కుటుంబాలకు కేటాయిస్తుంది, అదే 1402 ఎకరాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తరహాలో ఎకరానికి పైన పేర్కొన్న విధంగా ఎకరం ఒక్కింటికి 114 ఇళ్ల  చొప్పున 160000 కుటుంబాలకు ఇళ్లను నిర్మించవచ్చు.ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయం వలన, అమరావతి రాజధాని విధ్వంసకర కుట్రకు పాల్పడటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారుగా 110000 ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు అమరావతి రాజధాని లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉచితంగా ఇంటిని పొందే మహత్భాగ్యాన్ని, అమరావతి రైతుల త్యాగ ఫలితంగా ఏర్పడిన సువర్ణ అవకాశాన్ని ఈ ప్రభుత్వం సమూలంగా నాశనం చేయడం కాదా? 
ఇది కాదా మోసం? ఇది కాదా దుర్మార్గం? ఇది కాదా ప్రభుత్వ దుందుడుకు చర్య?ఈ ప్రభుత్వం కాదా పేదల పాలిట శాపం?వాస్తవాలను నిర్భయంగా ప్రకటిద్దాం.పేదల పక్షాన నిలబడదాం.ఈ ప్రభుత్వ కుట్రలను చేదిద్దాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం పేదవాడిని గెలిపిద్దాం’’ అని పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.