Publish Date:Oct 25, 2024
సలీం పెయింటింగ్స్ వేసి కుటుంబాన్ని పోషించుకునే వాడు. సలీం భార్యకు ఇది నచ్చేది కాదు. తన భర్త పెద్ద వ్యాపారిగా స్థిర పడలేదని భార్య ఆవేదన చెందేది. సలీంతో ప్రతీరోజు గొడవపడేది. మేరా బద్ కిస్మతీ( నా దురదృష్టం) అని గొడవపడేది. సలీం అన్నదమ్ములు బాగా సెటిలయ్యారు. పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. సలీం పరిస్థితి దిగ జారిపోవడంతో చుట్టాల్లో చులకనభావం అయ్యాడు . చివరకు ఫంక్షన్స్ కు కూడా ఆహ్వానం అందడం లేదు. మనస్థాపానికి గురైన సలీం మౌలానా దగ్గరికి వచ్చాడు.
సలీం: సలాం వాలేకుం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం సలీం భాయ్ , కైరియత్
సలీం: అల్ హమ్ దు లిల్లా మౌలానా సాబ్... జీ మౌలానా సాబ్ మేరా పైదాయిష్ ఏత్తే ఫాక్ సే ( నా పుట్టుక అనుకోకుండా జరిగింది) అంటూ నిట్టూర్చాడు.
మౌలానా: డార్విన్ సిద్దాంతం ప్రకారం భూమిపై 2000 మిలియన్ సంవత్సరాల క్రితం జీవాల పుట్టుక జరిగింది. ఇది సైన్స్ ప్రకారం చూస్తే బయటపడిన నిజం.
తొలుత ఏకకణ జీవులు, ఆ తర్వాత బహుళ సెల్యులార్ జీవులు క్రియాశీలకంగా మారాయి.
దవడలేని చేపలు పరిణామం చెందాయి. తరువాత, ఉభయచరాలు, సరీసృపాలు మరియు కొన్ని క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. వారి శారీరక లక్షణాలు, ప్రవర్తన మొదలైన వాటిలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
కొన్ని లక్షణాలు వారి తల్లిదండ్రుల నుండి సంతానానికి వారసత్వంగా సంక్రమిస్తాయి.
అన్ని జీవ జాతులలో పునరుత్పత్తి రేటు మారుతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ కొన్ని కనిష్టంగా పునరుత్పత్తి చేస్తాయి.
లక్షణాలు లేదా వ్యక్తిత్వాలు తరచుగా తల్లిదండ్రుల నుండి సంతానానికి సంక్రమిస్తాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన అల్లాకి తెలియకుండా ఏదీ జరగదు .. అన్నీ ఆయన కనుసన్నల్లో జరిగినవే. ఎవరికి సంపద ఇవ్వాలో ఎవరి సంపద ఇవ్వకూడదో అన్నీఆయనకు తెలుసు. మనిషి పుట్టుక కోసమే ఈ ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. 50 , 60 ఏళ్ల జీవితానికే మనిషి కలలు కంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు.కొన్ని వేల మిలియన్ సంవత్సరాల క్రితమే సృష్టి జరిగింది. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ సృష్టి అలానే ఉంటుంది. మనిషి కేరక్టర్ అతి చిన్నది. మంచి పనులు చేయడానికే మనిషి జన్మనెత్తాం. ఆ పనులు చేసి వెళ్లిపోవాలి. మనిషికి ఆక్సిజన్ అత్యంత ఆవిశ్యం. . ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండానే దేవుడు సహజసిద్దమైన ఆక్సిజన్ తయారు చేస్తున్నాడు ప్రకృ తి ద్వారా అది మనకందుతుంది. త్రాగడానికి నీళ్లు అవసరం కాబట్టి మేఘాలు గర్జించగానే వర్షం పడుతుంది. భూమిలో ఫిల్టర్ అయ్యే ఏర్పాట్లను కూడా అల్లా చేశాడు. గాలి, నీళ్ల తర్వాత రొట్టె ముఖ్యమైన ఆహారం. అది కూడా మనకు భూమి ద్వారా ఇవి పొందుతూనే ఉన్నాం. దేవుడు ఈ సెటప్ చేసేశాడు. ఇస్లాం పుట్టుక నుంచే సైన్స్ ఉంది. శాస్త్రవేత్తలను ఇస్లాం అందించింది. బ్రిటీషు వారు వచ్చాక ఇస్లాం సైంటిస్ట్ లు మరుగన పడ్డారు. ఈ విషయం ఖురాన్, హదీస్ లో కూడా ఉంది. అల్లా సంకల్పం తో మనిషి పుట్టుక జరిగింది.
ఎంటర్ టైన్ మెంట్ కోసమే మనిషి పుట్టుక ఉండ కూడదు. కోరికలు ఉండకూడదు.లక్ష్యాలు మాత్రం ఉండాలి. ఏదీ ఆశపడకూడదు. అల్లా సంకల్పిస్తే ఇస్తాడు. సంకల్పించకుంటే ఇవ్వడు. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారే తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో దించేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కోసమే బ్రిటీష్ వాళ్లు మత్తు పదార్థాలను పరిచయం చేశారు. మంచి పనులు చేయడానికే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటూ మౌలానా తన తక్రీర్( ప్రవచనం) ముగించాడు.
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-creation-is-for-the-birth-of-man-39-187400.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.