కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. థర్డ్ వేవ్ వార్తలు వణికిస్తున్నాయి. సెకండ్ వేవ్లోనే ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడితే.. ఇక మూడో ముప్పు ఏ రేంజ్లో ఉంటుందోననే భయం వేధిస్తోంది. థర్డ్ వేవ్లో వైరస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రంలో థర్డ్ వేవ్ కల్లోలం మొదలైపోయిందని.. ఒకే జిల్లాలో 8వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకిందని తెలడంతో అంతా అలర్ట్ అవుతున్నారు. మూడో ముప్పు నుంచి పిల్లలను రక్షించుకునేది ఎలానని తెగ హైరానా పడుతున్నారు తల్లిదండ్రులు.
థర్డ్ వేవ్ నుంచి పిల్లలను రక్షించడానికి ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రతి ఏడాది 'ఫ్లూ' సంబంధిత టీకాలను ఇవ్వడం మంచిదని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిషన్ (ఐఏపీ) సూచించింది. ఇటీవల అమెరికా మిచిగాన్ మిస్సోరీ నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం నిర్ధారణ అయింది. ఇనాక్టివేటెడ్ ఇన్ఫ్లూయెంజా టీకాను తీసుకున్న తర్వాత.. కొవిడ్ బారిన పడిన పిల్లలు.. త్వరగా కోలుకున్నారని తెలిసింది.
మహారాష్ట్ర పిడియాట్రిక్ టాస్క్ఫోర్స్ చిన్నారులు కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. కొవిడ్ టీకా, ఇన్ఫ్లూయెంజా టీకాలు.. ఎపిటామిమోలాజిక్ క్లినికల్ ఫీచర్లు ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. కరోనా వైరస్ పిల్లలపై ప్రాణాంతకంగా మారకుండా ఉండడానికి ఫ్లూ కి సంబంధించిన టీకాలు ఇప్పించడం మంచిదని తెలిపింది. ఫ్లూ టీకా వల్ల.. కొవిడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చని, పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించకుండా ఉంటుందని సూచించింది. పిల్లలకు ఇన్ఫ్లూయెంజా టీకా ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆ రోగ నిరోధక శక్తి కరోనా వైరస్తో పోరాడటానికి బాగా పనికొస్తుందనేది వైద్యులు చెబుతున్న మాట.
అయితే, ఫ్లూ టీకా, కరోనా టీకా.. ఆ రెండూ వేరు వేరు. అందుకే, ఒకవేళ పిల్లలకూ టీకాలు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆ రెండు టీకాలకు మధ్య దాదాపు నాలుగు వారాల సమయం ఉండాలి. అప్పుడు పిల్లల్లో యాంటీబాడీస్ డెవలప్మెంట్కి కావలసిన సమయం ఉంటుంది. వైరస్లతో పోరాడటానికి కావలసిన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎంతగా టీకాలు వేసుకున్నా.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం మాత్రం మరిచిపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/third-wave-alert-for-children-25-116727.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.