ప్రశాతంగా సాగుతున్న మూడో విడత పోలింగ్

Publish Date:May 7, 2024

Advertisement

సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాలలో ఈ  విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు చేసింది.

కాగా తొలి రెండు విడతలలో జరిగిన పోలింగ్ లో బీజేపీ ఒకింత వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. చివరకు బీజేపీ కూడా అలాగే భావిస్తోంది. ఈ నేపథ్యంలో  మూడో విడతలో ఆధిక్యత కోసం బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. విపక్షాలపై విమర్శల డోస్ పెంచింది. పలు చోట్ల విద్వేష ప్రసంగాలకూ వెనుకాడలేదు. దీంతో మూడో విడత పోలింగ్ సరళి ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
 
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది.  వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద భారీ క్యూలలో నిలబడి ఉండటం కనిపించింది. ఈ దశలో అసోం- 4  , బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2 లోక్ సభ నియోజకవర్గాలకు  పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా పడింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్ బిల్డర్ ఒకరు కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వర్తిస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24న కుటుంబ సభ్యులకు చెప్పి బీదర్  బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్‌కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని వెంట తీసుకెళ్లారు.
సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఏడు దశల్లో భాగంగా ఇక చివరి దశ మాత్రమే మిగిలింది. చివరి దశ పోలింగ్ వచ్చే నెల 1న జరగనుంది. స్వతంత్ర్య భారత చరిత్రలో ఎటువంటి ట్రెండ్ లేకుండా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఇవేనని అంటున్నారు.
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి . ఈ సందర్భంగా  వేడుకలకు ఘనంగా తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. 
సీఎస్ జవహర్ రెడ్డి పక్షపాత వైఖరి కారణంగా జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా, జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థనే ఏపీ సీఎష్ జవహర్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల స్వ‌ల్ప కాలానికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయ‌కుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒకే ఒక్క‌డు.. శకపురుషుడు.. నంద‌మూరి తార‌క‌రామారావు. 1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. ఈ రోజు మంగళవారం మే 28 ఆయన 101 జయంతి.
పీలో కూట‌మి అధికారంలోకి రాబోతోందా.. వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేల్లో ఆ విష‌యం స్ప‌ష్ట‌మైందా.. కూట‌మి అధికారంలోకి రాగానే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా.. జ‌గ‌న్ ప్ర‌మాదంలో ప‌డ‌బోతున్నారా..? ఐదేళ్ల కాలంలో చేసిన త‌ప్పిదాల‌తో జగన్ కు కొత్త చిక్కులు చుట్టుముట్టబోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. ఇలాంటి సందేహాల‌ను తెర‌పైకి తెచ్చింది ఎవ‌రో కాదు.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి న‌మ్మినబంటుగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే భక్తుల తాకిడి ఒకింత తగ్గిందనే చెప్పాలి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-8
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్‌గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు. రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.
చెన్సైలో లేడీస్ హాస్టల్లో లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ శరణిత (32) అనే మహిళ మరణించారు.
ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు తదుపరి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు. 
భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భార‌తి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.