తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుసుకుంటున్నాయి. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి సింధు శర్మ కు కంప్లయింట్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి. గత బుధవారం కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పోలీసుశాఖకు చెందిన ముగ్గురు చనిపోయారు. వీళ్లు సుసైడ్ చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? అనేది ఇంత వరకు తేలలేదు. వారం రోజులు ముగుస్తున్నా కేసు మిస్టరీ వీడటం లేదు. పెద్ద చెరువు వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు నత్త నడకన కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ , బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి , కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిఖిల్, శృతి వాట్సాప్ చాట్ లో విషయం బయటపడినప్పటికీ సాయికుమార్ ఐ ఫోన్ డెడ్ కావడంతో కాల్ డేటా ,చాటింగ్ వివరాలు బయటపడలేదు. వారం రోజుల నుంచి ఈ ఫోన్ ఎస్ పి కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ ఫోన్ హైద్రాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరుకుంది. డెడ్ అయిన ఈ ఫోన్ కాల్ డేటా, చాటింగ్ వివరాలు తెలిస్తే దర్యాప్తు మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు వీరి ముగ్గురి మధ్య పెద్ద చెరువు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడు వెర్షెన్ లలో కథనాలు వినిపిస్తున్నాయి. మొదటి వెర్షన్ ప్రకారం నిఖిల్ , శృతి వివాహానికి ఇష్టపడని సాయికుమార్ వీరిద్దరిపై దాడి చేసినట్టు ఓ కథనం ప్రచారంలో ఉంది. ప్రతిగా వీరిద్దరు సాయికుమార్ పై దాడి చేశారు. సాయికుమార్ శృతిని నీళ్లలో తోసేసాడు. ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకినట్లు సమాచారం. వీరిద్దరు చనిపోవడంతో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో వెర్షన్ ప్రకారం ముగ్గురు మధ్య జరిగిన ఘర్షణలో సాయికుమార్ శృతిని కొట్టాడు . వెంటనే చెరువు గట్టు మీద పరుగెత్తి చెరువులో పడిపోయింది శృతి. ఆమెను కాపాడటానికి నిఖిల్ చెరువులో దూకేసాడు. వీరిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ముగ్గురికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు.
మూడో వెర్షన్ ప్రకారం సాయికుమార్, శృతి, నిఖిల్ వివాదంలో నాలుగో వ్యక్తి తల దూర్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. నాలుగో వ్యక్తికి శృతికి అత్యంత సన్నిహితుడు. గొడవ ముదరడానికి అతనే కారణమని మరో కథనం . ఈ నాలుగో వ్యక్తి ఆవేశంతో అరుపులు ఎక్కువకావడంతో శృతి నీళ్లలో దూకింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకాడు. వీరిరువురిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ఈత రాకపోవడంతో మొత్తం ముగ్గురూ చనిపోయారు.
ఎస్ పి సింధుశర్మ వద్దకు నిఖిల్ కంప్లయింట్ ఉన్నవార్తలను పోలీసు శాఖ గురువారం ఖండించింది. స్వయంగా సింధూశర్మ ఈ విషయాన్నివెల్లడించారు. నా వద్ద ఈ వివాదానికి సంబంధించిన సమాచారం లేదు. క్రింది స్థాయి అధికారులకు కంప్లయింట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఎస్ పి కార్యాలయంలో సిసిటీవీ కెమెరాలు ఎందుకు పని చేయలేదో అనేది సింధుశర్మ చెప్పలేకపోయారు. కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు రోజుకో సవాల్ ను ఎదుర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ సుసైడ్ కేసు పురోగతి సాధించకపోవడానికి సాక్ఖ్యాధారాలు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి సాయికుమార్ తన కారులో టోల్ గేట్ దాటే విజువల్స్ కీలక ఆధారం. ముగ్గురు వేర్వేరుగా వచ్చి చెరువువద్ద ఎందుకు గొడవపడ్డారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు వచ్చారా? వీరిలో ఎవరు హంతకులు అనేది తేలడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు సస్పెన్స్ వీడే అవకాశం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-killer-in-kamareddy-triangle-love-story-case-is-the-fourth-person-39-190686.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.