తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన కామారెడ్డి ట్రయాంగిల్ సుసైడ్ ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుసుకుంటున్నాయి. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి సింధు శర్మ కు కంప్లయింట్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి. గత బుధవారం కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పోలీసుశాఖకు చెందిన ముగ్గురు చనిపోయారు. వీళ్లు సుసైడ్ చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? అనేది ఇంత వరకు తేలలేదు. వారం రోజులు ముగుస్తున్నా కేసు మిస్టరీ వీడటం లేదు. పెద్ద చెరువు వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు నత్త నడకన కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ , బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి , కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిఖిల్, శృతి వాట్సాప్ చాట్ లో విషయం బయటపడినప్పటికీ సాయికుమార్ ఐ ఫోన్ డెడ్ కావడంతో కాల్ డేటా ,చాటింగ్ వివరాలు బయటపడలేదు. వారం రోజుల నుంచి ఈ ఫోన్ ఎస్ పి కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ ఫోన్ హైద్రాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరుకుంది. డెడ్ అయిన ఈ ఫోన్ కాల్ డేటా, చాటింగ్ వివరాలు తెలిస్తే దర్యాప్తు మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు వీరి ముగ్గురి మధ్య పెద్ద చెరువు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడు వెర్షెన్ లలో కథనాలు వినిపిస్తున్నాయి. మొదటి వెర్షన్ ప్రకారం నిఖిల్ , శృతి వివాహానికి ఇష్టపడని సాయికుమార్ వీరిద్దరిపై దాడి చేసినట్టు ఓ కథనం ప్రచారంలో ఉంది. ప్రతిగా వీరిద్దరు సాయికుమార్ పై దాడి చేశారు. సాయికుమార్ శృతిని నీళ్లలో తోసేసాడు. ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకినట్లు సమాచారం. వీరిద్దరు చనిపోవడంతో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో వెర్షన్ ప్రకారం ముగ్గురు మధ్య జరిగిన ఘర్షణలో సాయికుమార్ శృతిని కొట్టాడు . వెంటనే చెరువు గట్టు మీద పరుగెత్తి చెరువులో పడిపోయింది శృతి. ఆమెను కాపాడటానికి నిఖిల్ చెరువులో దూకేసాడు. వీరిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ముగ్గురికి ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు.
మూడో వెర్షన్ ప్రకారం సాయికుమార్, శృతి, నిఖిల్ వివాదంలో నాలుగో వ్యక్తి తల దూర్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. నాలుగో వ్యక్తికి శృతికి అత్యంత సన్నిహితుడు. గొడవ ముదరడానికి అతనే కారణమని మరో కథనం . ఈ నాలుగో వ్యక్తి ఆవేశంతో అరుపులు ఎక్కువకావడంతో శృతి నీళ్లలో దూకింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ నీళ్లలో దూకాడు. వీరిరువురిని కాపాడటానికి సాయికుమార్ నీళ్లలో దూకాడు. ఈత రాకపోవడంతో మొత్తం ముగ్గురూ చనిపోయారు.
ఎస్ పి సింధుశర్మ వద్దకు నిఖిల్ కంప్లయింట్ ఉన్నవార్తలను పోలీసు శాఖ గురువారం ఖండించింది. స్వయంగా సింధూశర్మ ఈ విషయాన్నివెల్లడించారు. నా వద్ద ఈ వివాదానికి సంబంధించిన సమాచారం లేదు. క్రింది స్థాయి అధికారులకు కంప్లయింట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఎస్ పి కార్యాలయంలో సిసిటీవీ కెమెరాలు ఎందుకు పని చేయలేదో అనేది సింధుశర్మ చెప్పలేకపోయారు. కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు రోజుకో సవాల్ ను ఎదుర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ సుసైడ్ కేసు పురోగతి సాధించకపోవడానికి సాక్ఖ్యాధారాలు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి సాయికుమార్ తన కారులో టోల్ గేట్ దాటే విజువల్స్ కీలక ఆధారం. ముగ్గురు వేర్వేరుగా వచ్చి చెరువువద్ద ఎందుకు గొడవపడ్డారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముగ్గురు వచ్చారా? వీరిలో ఎవరు హంతకులు అనేది తేలడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. అప్పటివరకు సస్పెన్స్ వీడే అవకాశం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-killer-in-kamareddy-triangle-love-story-case-is-the-fourth-person-39-190686.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.