Publish Date:Feb 10, 2020
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపైనా, ప్రభుత్వ విధానాలపైనా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కియా తరలిపోతోందంటూ కియాపై రాయిటర్స్ రాసిన కథనంతో రాష్ట్రంలో కల్లోలం చెలరేగగా, ఇఫ్పుడు మరో ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన ఆర్టికల్ మరింత కలవరం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ది ఎకనమిక్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. జగన్ విధానాలను ఒక రేంజులో ఏకిపారేసింది. జగన్ తీరుతో కొత్తగా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టేందుకు జంకుతుండగా... ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోతున్నారంటూ డేరింగ్ కథనం ప్రచురించింది. రివర్స్ స్వింగ్ పేరుతో రాసిన ఆర్టికల్లో జగన్ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది.
కేంద్ర వాణిజ్యశాఖ, ప్రపంచబ్యాంక్, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ సర్వేల ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు వాణిజ్యానికి అనుకూలందని, అయితే... జగన్మోహన్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టాక... వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని కథనంలో తెలిపింది. జగన్ నిర్ణయాలతో ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడుదారులకు ముప్పు ఏర్పడిందంటూ విశ్లేషించింది. విండ్ అండ్ సోలార్ పవర్ టారిఫ్ ల పునసమీక్ష... పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల రద్దు... ఆయా కంపెనీలకు కేటాయించిన భూములను వాపస్ తీసుకోవడంలాంటి నిర్ణయాలతో ప్రమాదకర సంప్రదాయానికి జగన్ శ్రీకారం చుట్టారని కథనంలో రాసుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నందుకు చాలా పశ్చాత్తాపడుతున్నామని అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి సంస్థ అక్మె సోలార్ హోల్డింగ్స్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించింది.
ఇక, కియా తరలిపోతోందంటూ రాయిటర్స్ రాసిన కథనం తర్వాత అలాంటిదేమీ లేదంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం.... అటు కియా యాజమాన్యం ఖండించినా... జగన్ ప్రభుత్వానికి-కియా కంపెనీకి మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నమాట మాత్రం వాస్తవమని... అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ అభిప్రాయపడింది.
మరోవైపు, పీపీఏల రద్దు దిశగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర డిస్కములపై పెద్దఎత్తున రుణభారం పడుతుందని విశ్లేషించింది. ఆయా విద్యుదుత్పత్తి సంస్థలకున్న బకాయిలతో కలిపి 21వేల కోట్ల రూపాయల రుణభారం డిస్కములపై పడుతుందని తెలిపింది. అయితే, ఇలా ఒప్పందాలను రద్దు చేసుకుంటూపోతే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని... ఇప్పుడు పీపీఏలపై పునసమీక్షించిన ప్రభుత్వం... ముందుముందు మిగతా రంగాల్లో జరగొచ్చని, ఇది ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదంటూ అభిప్రాయపడింది. మొత్తానికి జగన్ ప్రభుత్వంపై జాతీయ అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రచురిస్తోన్న కథనాలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును... అలాగే, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కథనాలు ప్రచురించడం కలకలం రేపుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-economic-times-punch-on-ap-cm-ys-jagan-25-94041.html
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.