ఇదీ ఎర్త్‌ డే కథ

Publish Date:Apr 22, 2017

Advertisement

 

 

1969 జనవరి 28: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఒక చమురుబావి నుంచి ముడిచమురు పొంగి పొర్లడం మొదలైంది. పదిరోజుల పాటు జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు లక్ష బ్యారెల్స్ చమురు నీటిపాలైంది. నీటిలో చమురు కలవడం వల్ల వేలాది సముద్ర పక్షులు చనిపోయాయి. ఇక నీటిలో ఉన్న ప్రాణులకి జరిగిన నష్టానికైతే లెక్కే లేదు. సహజంగానే ఈ వార్త సంచలనం సృష్టించింది. ‘ఇంధనం కోసం చేసే ప్రయత్నాలలో ఇవన్నీ మామూలే!’ అంటూ జనం ఎవరి పని వాళ్లు చూసుకున్నారు. కానీ కొంతమందిలో మాత్రం ఈ ఘటన భయం కలిగించింది. పర్యావరణం పట్ల మనం ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నమా! అన్న ఆలోచన రేకెత్తించింది. ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ ఉద్యమం నిర్మించే ప్రయత్నం జరిగింది. అదే ‘ఎర్త్‌ డే’.

 

1970లో అప్పటి అమెరికన్‌ సెనెటర్‌ Gaylord Nelson నేతృత్వంలో ఈ ఎర్త్‌ డే అనే ఉద్యమం మొదలైంది. ఆ ఏడాది ఏప్రిల్‌ 22న దాదాపు రెండుకోట్ల మంది ఊరేగింపులలోపాల్గొని పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. అప్పటి నుంచి ఏటా ఎర్త్‌ డేను నిర్వహిస్తూనే ఉన్నారు.

 

అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలో పర్యావరణం గురించి పోరాడటం ఏమంత తేలిక కాదు. ఎందుకంటే పర్యావరణానికి హాని కలగకుండా భౌతికమైన అభివృద్ధి సాధ్యంకాదు. అందుకే అక్కడి ప్రభుత్వాలు కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలకి, పారిశ్రామిక అభివృద్ధి కారణం కాదంటూ వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పర్యావరణం గురించి చిన్నాచితకా ఉద్యమాలు మొదలైనా... వాటి మాట ప్రభుత్వం ముందు నిలబడదు. కానీ అలాంటి చిన్నా చితకా ఉద్యమాలన్నీ ఏకమయ్యే అవకాశం కల్పించింది ‘ఎర్త్‌ డే’. ఫలితంగా ప్రభుత్వం సైతం తల వంచి పర్యావరణాన్నీ, వన్య ప్రాణులనీ కాపాడేందుకు చట్టాలు చేయక తప్పలేదు.

 

ఒక చిన్న ఆందోళనగా మొదలైన ‘ఎర్త్‌ డే’ ఉద్యమం ఇప్పుడు వందకు పైగా దేశాల్లో ప్రభావం చూపుతోంది. క్రితం ఏడాది ఎర్త్‌ డే రోజున ఇండియా సహా 120 దేశాలు Paris Climate Agreement మీద సంతకం చేశాయంటే... ఉద్యమం ఫలిస్తున్నట్లేగా! గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేస్తూ కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించడమే ఈ Paris Climate Agreement ఉద్దేశం.

 

ఎర్త్‌ డే రోజున ఉద్యమకారులు ఎలాగూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడతారు. కోట్ల కొద్దీ చెట్లని నాటుతూ ఉంటారు. కానీ ఈ ఉద్యమంతో సంబంధం లేనివారు కూడా ఎంతోకొంత పర్యావరణం మీద శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ‘ఒక్కడినే ఏం చేయగలను?’ అనుకోవడానికి లేదనీ... పర్యావరణం మీద ప్రతి ఒక్కరి చర్యా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. చిన్నచిన్న దూరాలకి సైకిల్‌ లేదా నడక మీద ఆధారపడటం, చెట్లు నాటడం, రీసైకిల్డ్‌ వస్తువులని ప్రోత్సహించడం, విద్యుత్తుని వృధా చేయకపోవడం, అనవసరమైన ప్రింట్‌ఔట్స్‌ తీసుకోకపోవడం, శాకాహారం వైపు మొగ్గు చూపడం... లాంటి సవాలక్ష ఉపాయాలన్నీ పర్యావరణాన్ని ఎంతోకొంత కాపాడేవే! ఇవే కనుక పాటిస్తే ప్రతిరోజూ ఎర్త్‌ డేనే!

 

- నిర్జర.

 

By
en-us Political News

  
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.