Publish Date:Oct 22, 2025
ఎంతైనా మంత్రి కొండా సురేఖ ఘటికురాలే. ఇంటిపేరుకు తగ్గట్టే కొండల్ని ఢీ కొట్టి మరీ నిలబబడుతున్నారామె. ఇంత వివాదం చెలరేగితే.. సింపుల్ గా సీఎం రేవంత్ కి పండగ శుభాకాంక్షలు చెప్పి.. ఆల్ ఈజ్ వెల్. బేఫికర్.. మైహూనా! అన్న కలరింగ్ ఇవ్వగలుగుతున్నారు. నాగార్జున విషయంలోనే కొండా వికెట్ డౌన్ అనుకున్నారంతా. ఎలాగోలా ఆ తుఫాన్ తట్టుకుని నిలబడగలిగారు. అప్పుడు కూడా ఆమె పై తీవ్ర వివాదం చెలరేగింది. ఆమె కాబట్టి ఈ మాత్రం తాకిడి తట్టుకుని నిలబడగలిగారు. మరొకరై ఉంటే భూస్థాపితం అయిపోయేవారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.
పొన్నం చూడండి.. అడ్లూరిని ఒక మాట అని ఎంత ఆగమయ్యారో.. అదే కొండా సురేఖ.. నాగార్జున ద్వారా కేటీఆర్ ని టార్గెట్ చేస్తే.. అది లోకమంతా కూడా కోడై కూసింది. అయినా సరే ఆమె బేషరతు సారీలు చెప్పలేదు.. కాకుంటే ఇటీవల తాను ఒకటి అంటే, మీడియా వక్రీకరణ మరొకటిగా మారిందని.. చిన్న కామెంట్ చేసి సైలెంట్ అయ్యారు. సరే, కేటీఆర్ ని ఆటాడించడానికి.. దీని వెనక స్టోరీ- స్క్రీన్ ప్లే- ఎవరిదీ ఏంటన్నది అప్రస్తుతం.
ఇదిలా ఉంటే తాజాగా మరో కొండా మార్క్ వివాదం.. అదే మేడారం జాతర కాంట్రాక్టు, ఓఎస్డీ సుజిత్ వ్యవహారం. ఈ విషయంలో స్వయంగా తాను రంగంలోకి దిగకుండా.. తన కుమార్తె సుస్మితను దించారు. మీరుగానీ మా అమ్మను టచ్ చేస్తే మీ డెక్కెన్ సిమెంటు బాగోతాలన్ని బయట పెడతా. ఇతరత్రా గుట్టు మట్లన్నీ విప్పి చెప్పేస్తానంటూ చిన్న ఫీలర్ వదలడంతో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. దీంతో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ వంటి వారంతా రెడ్డి.. అలెర్ట్ ఎస్ మీరు చదివింది కరెక్టే.. అది రెడ్డి అలెర్టే.. అయ్యి.. దీని ద్వారా యాంటీ- బీసీ వాయిస్ జనాల్లోకి వెళ్తుందని ఎక్కడికక్కడ గప్ చుప్ అనేలా చేశారు.
ఇక్కడ కూడా కొండా కొండాయే అన్న కామెంట్లు వినిపించాయి. అక్కడ బయట నుంచి తీన్మార్ మల్లన్న రెడ్లపై అన్నేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కి గురైతే, సురేఖ సింపుల్ గా రెడ్లు ఒక బీసీ మహిళ అయిన తనను తొక్కాలని చూస్తున్నారంటూ కామెంట్లు చేసి కూడా.. ఇంత హ్యాపీగా తన మంత్రి పదవి కాపాడుకుంటున్నారు. ఎంతైనా కొండా కొండాయే అన్న టాక్ వైల్డ్ గా కాదు కాదు, వైల్డ్ కే వైల్డ్- మ్యాక్స్ ప్రో స్ప్రెడ్ అవుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. మరి చూడాలి కొండా నెక్స్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో ?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/that-is-konda-surekha-25-208297.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.