Publish Date:Oct 22, 2025
ఎంతైనా మంత్రి కొండా సురేఖ ఘటికురాలే. ఇంటిపేరుకు తగ్గట్టే కొండల్ని ఢీ కొట్టి మరీ నిలబబడుతున్నారామె. ఇంత వివాదం చెలరేగితే.. సింపుల్ గా సీఎం రేవంత్ కి పండగ శుభాకాంక్షలు చెప్పి.. ఆల్ ఈజ్ వెల్. బేఫికర్.. మైహూనా! అన్న కలరింగ్ ఇవ్వగలుగుతున్నారు. నాగార్జున విషయంలోనే కొండా వికెట్ డౌన్ అనుకున్నారంతా. ఎలాగోలా ఆ తుఫాన్ తట్టుకుని నిలబడగలిగారు. అప్పుడు కూడా ఆమె పై తీవ్ర వివాదం చెలరేగింది. ఆమె కాబట్టి ఈ మాత్రం తాకిడి తట్టుకుని నిలబడగలిగారు. మరొకరై ఉంటే భూస్థాపితం అయిపోయేవారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.
పొన్నం చూడండి.. అడ్లూరిని ఒక మాట అని ఎంత ఆగమయ్యారో.. అదే కొండా సురేఖ.. నాగార్జున ద్వారా కేటీఆర్ ని టార్గెట్ చేస్తే.. అది లోకమంతా కూడా కోడై కూసింది. అయినా సరే ఆమె బేషరతు సారీలు చెప్పలేదు.. కాకుంటే ఇటీవల తాను ఒకటి అంటే, మీడియా వక్రీకరణ మరొకటిగా మారిందని.. చిన్న కామెంట్ చేసి సైలెంట్ అయ్యారు. సరే, కేటీఆర్ ని ఆటాడించడానికి.. దీని వెనక స్టోరీ- స్క్రీన్ ప్లే- ఎవరిదీ ఏంటన్నది అప్రస్తుతం.
ఇదిలా ఉంటే తాజాగా మరో కొండా మార్క్ వివాదం.. అదే మేడారం జాతర కాంట్రాక్టు, ఓఎస్డీ సుజిత్ వ్యవహారం. ఈ విషయంలో స్వయంగా తాను రంగంలోకి దిగకుండా.. తన కుమార్తె సుస్మితను దించారు. మీరుగానీ మా అమ్మను టచ్ చేస్తే మీ డెక్కెన్ సిమెంటు బాగోతాలన్ని బయట పెడతా. ఇతరత్రా గుట్టు మట్లన్నీ విప్పి చెప్పేస్తానంటూ చిన్న ఫీలర్ వదలడంతో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. దీంతో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ వంటి వారంతా రెడ్డి.. అలెర్ట్ ఎస్ మీరు చదివింది కరెక్టే.. అది రెడ్డి అలెర్టే.. అయ్యి.. దీని ద్వారా యాంటీ- బీసీ వాయిస్ జనాల్లోకి వెళ్తుందని ఎక్కడికక్కడ గప్ చుప్ అనేలా చేశారు.
ఇక్కడ కూడా కొండా కొండాయే అన్న కామెంట్లు వినిపించాయి. అక్కడ బయట నుంచి తీన్మార్ మల్లన్న రెడ్లపై అన్నేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కి గురైతే, సురేఖ సింపుల్ గా రెడ్లు ఒక బీసీ మహిళ అయిన తనను తొక్కాలని చూస్తున్నారంటూ కామెంట్లు చేసి కూడా.. ఇంత హ్యాపీగా తన మంత్రి పదవి కాపాడుకుంటున్నారు. ఎంతైనా కొండా కొండాయే అన్న టాక్ వైల్డ్ గా కాదు కాదు, వైల్డ్ కే వైల్డ్- మ్యాక్స్ ప్రో స్ప్రెడ్ అవుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. మరి చూడాలి కొండా నెక్స్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో ?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/that-is-konda-surekha-25-208297.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు