Publish Date:Oct 22, 2025
ఎంతైనా మంత్రి కొండా సురేఖ ఘటికురాలే. ఇంటిపేరుకు తగ్గట్టే కొండల్ని ఢీ కొట్టి మరీ నిలబబడుతున్నారామె. ఇంత వివాదం చెలరేగితే.. సింపుల్ గా సీఎం రేవంత్ కి పండగ శుభాకాంక్షలు చెప్పి.. ఆల్ ఈజ్ వెల్. బేఫికర్.. మైహూనా! అన్న కలరింగ్ ఇవ్వగలుగుతున్నారు. నాగార్జున విషయంలోనే కొండా వికెట్ డౌన్ అనుకున్నారంతా. ఎలాగోలా ఆ తుఫాన్ తట్టుకుని నిలబడగలిగారు. అప్పుడు కూడా ఆమె పై తీవ్ర వివాదం చెలరేగింది. ఆమె కాబట్టి ఈ మాత్రం తాకిడి తట్టుకుని నిలబడగలిగారు. మరొకరై ఉంటే భూస్థాపితం అయిపోయేవారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.
పొన్నం చూడండి.. అడ్లూరిని ఒక మాట అని ఎంత ఆగమయ్యారో.. అదే కొండా సురేఖ.. నాగార్జున ద్వారా కేటీఆర్ ని టార్గెట్ చేస్తే.. అది లోకమంతా కూడా కోడై కూసింది. అయినా సరే ఆమె బేషరతు సారీలు చెప్పలేదు.. కాకుంటే ఇటీవల తాను ఒకటి అంటే, మీడియా వక్రీకరణ మరొకటిగా మారిందని.. చిన్న కామెంట్ చేసి సైలెంట్ అయ్యారు. సరే, కేటీఆర్ ని ఆటాడించడానికి.. దీని వెనక స్టోరీ- స్క్రీన్ ప్లే- ఎవరిదీ ఏంటన్నది అప్రస్తుతం.
ఇదిలా ఉంటే తాజాగా మరో కొండా మార్క్ వివాదం.. అదే మేడారం జాతర కాంట్రాక్టు, ఓఎస్డీ సుజిత్ వ్యవహారం. ఈ విషయంలో స్వయంగా తాను రంగంలోకి దిగకుండా.. తన కుమార్తె సుస్మితను దించారు. మీరుగానీ మా అమ్మను టచ్ చేస్తే మీ డెక్కెన్ సిమెంటు బాగోతాలన్ని బయట పెడతా. ఇతరత్రా గుట్టు మట్లన్నీ విప్పి చెప్పేస్తానంటూ చిన్న ఫీలర్ వదలడంతో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. దీంతో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ వంటి వారంతా రెడ్డి.. అలెర్ట్ ఎస్ మీరు చదివింది కరెక్టే.. అది రెడ్డి అలెర్టే.. అయ్యి.. దీని ద్వారా యాంటీ- బీసీ వాయిస్ జనాల్లోకి వెళ్తుందని ఎక్కడికక్కడ గప్ చుప్ అనేలా చేశారు.
ఇక్కడ కూడా కొండా కొండాయే అన్న కామెంట్లు వినిపించాయి. అక్కడ బయట నుంచి తీన్మార్ మల్లన్న రెడ్లపై అన్నేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కి గురైతే, సురేఖ సింపుల్ గా రెడ్లు ఒక బీసీ మహిళ అయిన తనను తొక్కాలని చూస్తున్నారంటూ కామెంట్లు చేసి కూడా.. ఇంత హ్యాపీగా తన మంత్రి పదవి కాపాడుకుంటున్నారు. ఎంతైనా కొండా కొండాయే అన్న టాక్ వైల్డ్ గా కాదు కాదు, వైల్డ్ కే వైల్డ్- మ్యాక్స్ ప్రో స్ప్రెడ్ అవుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. మరి చూడాలి కొండా నెక్స్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో ?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/that-is-konda-surekha-25-208297.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.