వీర జవాన్ లారా! లాఠీలతోనే దేశాన్ని కాపాడేయండి

Publish Date:Mar 14, 2013

Advertisement

 

నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ లో సీఆర్పీయఫ్ దళాలపై పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాడిలో 5మంది జవాన్లు మరణించగా, మరో 8మంది తీవ్ర గాయపడ్డారు. వారి చేతుల్లో ఆయుధాలుకు బదులు కేవలం లాఠీలు మాత్రమే ఉండటంవల్లనే వారందరూ ఉగ్రవాదుల చేతుల్లో మరణించారని స్వయంగా అక్కడి జవాన్లే మీడియాకి వెల్లడించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది.

 

అందుకు కారణం, ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కేంద్రహోం శాఖ వారిని లాఠీలతో సరిబెట్టుకోమని ఆదేశించింది. తత్ఫలితంగా 5మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మన పొరుగునున్న పాకిస్తాన్ నిత్యం మన దేశంలోకి ఎగుమతి చేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు నియమింపబడిన మన జవాన్లకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వకపోగా, ఉన్న ఆయుధాలను కూడా తీసేసుకొన్న ప్రభుత్వం పరోక్షంగా వారి చావుకి కారణం అయింది.

 

ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, 5మంది జవాన్లు మరణించినా స్థానికంగానే ఉండే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కనీసం తమ సహచరుల మరణానికి సానుభూతిగా నాలుగు మాటలు కూడా పలుకలేకపోయాడని, దేశం కోసం పోరాడుతూ మరణిస్తున్న తమ ప్రాణాలకు అసలు విలువ, గౌరవం లేకుండా పోయాయని అక్కడి జవాన్లు మీడియాతో అన్నతరువాతనే ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.

 

జవాన్లు పలికిన ఈ మాటలు రాజధాని వరకు పాకిన తరువాతనే పార్లమెంటు కూడా వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం మన రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు మన జవాన్లపట్ల ఎంత గౌరవం ఉందో తెలియజేస్తోంది. ఉగ్రవాదులు మన దేశం పై దాడి చేస్తే దానిపై రాజకీయ రగడ చేయడమే తప్ప, కనీసం మరణించిన వారికి సానుభూతి తెలపాలని మన రాజకీయ నేతలకి ఆలోచన కలుగకపోవడం నిజంగా దురదృష్టం.

 

ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే, కాశ్మీరులో నెలకొన్న సున్నితమయిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే జవాన్లకు ఆయుధాలు చేత బట్టుకొని తిరిగేందుకు అనుమతినీయలేదని అన్నారు. ఈ నిర్ణయం వలన 5 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే గాకుండా, ఆ జవాన్ల కుటుంబాలకు జీవితకాల శోకం మిగిలింది. దేశాన్ని రక్షించాలని కోరిన సైనికులను తగిన ఆయుధాలు కూడా ఇచ్చేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.