కేసీఆర్ తీరుతో బీజేపీలో ఆందోళన!

Publish Date:Jun 10, 2023

Advertisement

తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందా? ఇందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావేనా? అంటే కమలనాథులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి హైప్ ఇచ్చిందీ, ఇప్పుడా హైప్ ను తగ్గించేసి పార్టీని మళ్లీ మొదటికి తీసుకువచ్చిందీ కూడా కేసీఆరే అని అంటున్నారు. కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బీజేపీకి లేని హైప్ ను క్రియేట్ చేశారని పరిశీలకులు అంటున్నారు.

అయితే  అలా చేయడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పెరిగేదీ ఉండదు.. ఆ పార్టీకి ఒరిగేదీ ఏమీ ఉండదని ఆయన భావించారంటున్నారు. కానీ తర వైఖరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని ఆయన భావించారు. చాలా వరకూ ఆయన అనుకున్నట్లే జరిగింది కానీ, కేసీఆర్ కృత్రిమంగా బీజేపీకి క్రియేట్ చేసిన హైప్ ఆసరాగా తీసుకుని ఆ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు (గతంలో టీఆర్ఎస్)కు దీటుగా ఎదిగింది. ఆయన రాష్ట్రంలో బీజేపీకి ఉద్దేశపూర్వకంగా హైప్ క్రియోట్ చేయడానికి కాంగ్రెస్ ను బలహీన పరచడమే కాకుండా తన జాతీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కూడా దోహదపడుతుందని భావించారు. అయితే కేసీఆర్ వ్యూహాలు ఆ విషయంలో పెద్దగా ఫలించలేదు. అంతే కాకుండా ఆయన బీజేపీ వ్యతిరేకత బూమరాంగ్ కూడా అయ్యింది.

ఆయన పదే పదే కేంద్రంలోని మోడీ సర్కార్ ను, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని విమర్శించడంతో.. రాష్ట్రంలో కమలం బలోపేతమైంది. బీఆర్ఎస్ ను గట్టిగా ఢీ కొనే స్థాయికి చేరింది. అదే సమయంలో ఆయన బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకోవడాన్ని జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు నమ్మలేదు. అందుకే ఆయన కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ చెప్పులరిగేలా దేశమంతా తిరిగినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన ఇక లాభం లేదనుకుని సొంతంగా జాతీయ పార్టీని ప్రారంభించేశారు.

అందుకు ఇంత కాలం తనకు అండగా, తన అధికారానికి దండగా నిలిచిన తెలంగాణ సెంటిమెంటును కూడా వదిలేసుకున్నారు. పార్టీలోని తెలంగాణ పేరును తీసేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఇలా చేయడం వల్ల ఆయనకు ఒరిగిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు కానీ ఇక ఏ ఎన్నికలోనూ ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా తీసుకునే అవకాశాన్ని మాత్రం కోల్పోయారు. అదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ తీరు వల్లే బలోపేతమైన బీజేపీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టగలమనుకునే స్థాయికి ఎదిగింది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ తన పొరపాటును గుర్తించారు. అంతే వ్యూహాత్మకంగా తన ప్రసంగాలలో బీజేపీ పేరెత్తడం మానేశారు. దీని వల్ల గతంలో  అంటే టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో ఆయన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు మొదటి నుంచీ కేసీఆర్ బీజేపీ బీటీమ్ గానే వ్యవహరించారంటూ విశ్లేషణలు చేస్తున్నారు.

అదే సమయంలో  రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొనేందుకు కూడా  కేసీఆర్ వెరవ లేదు. అయితే.. ఇప్పుడు బీజేపీకి ఇంకా ప్రాధాన్యత ఇస్తూ పోతే.. రాష్ట్రంలో తన అధికారానికే ముప్పు వస్తుందన్న భావనకు వచ్చిన కేసీఆర్ బీజేపీ పేరెత్తడం మానేశారు. ఇదే బీజేపీకి తెలంగాణలో మైనస్ అయ్యింది. కర్నాటక ఫలితాలతో దిగాలు పడిన బీజేపీకి కేసీఆర్ మారిన వైఖరి మరింత ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి కారణమైన బీజేపీ, మోడీ వ్యతిరేకతకు కేసీఆర్ నీళ్లొదిలేశారన్న ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఆయన బీజేపీయేతర పార్టీల సీఎంల భేటీకి దూరంగా ఉండటంతో  కేసీఆర్ బీజేపీల మధ్య రహస్య మైత్రి ఉందన్న భావన బలపడుతోంది. సరిగ్గా ఇదే తెలంగాణలో బీజేపీని బలహీన పరుస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత బీజేపీపై కూడా ప్రతిఫలిస్తుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అది అంతిమంగా  కాంగ్రెస్ కే ప్రయోజనం చూకూరుస్తుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

By
en-us Political News

  
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.