జగన్ రెడ్డి బెయిలు జీవితానికి పదేళ్లు

Publish Date:Sep 23, 2023

Advertisement

లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలు, 42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేశారని దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారణ, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలల సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన పొలిటికల్ లీడర్, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ జీవితంలో కూడా అనితరసాధ్యమైన రికార్డ్ సృష్టించారనే చెప్పాలి.  అవును.. నిజమే.. ఆయన సృష్టించిన రికార్డు నభూతో.. నభవిష్యత్ వంటిదే మరి. అదేమిటంటూ..  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై జైలు నుండి బయటకొచ్చి నేటితో పదేళ్లు పూర్తయింది.  ఔను ఆయన నేడు పదో బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో.. సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఇదే  హాట్ టాపిక్ గా మారింది. ఈ పదేళ్లలో సీబీఐ కోర్టు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలన సాకుగా చెప్పుకుంటూ   విచారణకు హాజరు కావడం లేదు. ఫలితంగా ఈ కేసు దశాబ్దానికి పైగా సాగుతూనే ఉంది. పదేళ్ల కాలంలో జగన్ పలుమార్లు విదేశీ యాత్రలకు వెళ్లగా.. ప్రతిసారి కోర్టు అనుమతి తీసుకొని, కోర్టులో  సమర్పించిన పాస్ పోర్ట్ తీసుకొని వెళ్లడం, తిరిగి రాగానే మళ్ళీ కోర్టుకు అప్పగించడం చేస్తున్నారు.

42 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉండడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై టీడీపీ యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి  పదో బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.  42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని లోకేష్ చంద్రబాబు అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా సెటైర్లు వేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మాట్టాభి.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి, ‘ఎక్కువ కాలం బెయిల్‌పై జీవించిన వ్యక్తి’గా జగన్ రెడ్డిని గుర్తించి, ఆయనకు ఒక రికార్డ్ ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టానని.. వారు త్వరలోనే జగన్ రెడ్డిని కలిసి ఆయన సాధించిన ఘనతకు సంబంధించిన సర్టిఫికెట్ అందిస్తారన్నారు. ఆ సర్టిఫికెట్‌ను జగన్ రెడ్డి పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి తన ప్యాలెస్‌లతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. మిగతా టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ శ్రేణులు జగన్ బెయిల్ డేపై సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తిస్తున్నారు.

కాగా, పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పైనే దర్జాగా తిరుగుతుండడంపై పరిశీలకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇంతటి హై ప్రొఫైల్ కేసు, ఇంత ప్రజా ధనం దోచుకున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించిన ఈ కేసులో ఓ నిందితుడు ఇలా రాజ్యమేలడం, ఈ కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉండడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కేంద్రం అండదండలతోనే ఇంత కాలం పాటు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించగలిగారని అంటున్నారు.  ఈ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచగానే జగన్ కేంద్రం తలుపు తట్టడం.. దర్యాప్తు మందగించడం.. పదేళ్లుగా ఇదే పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసు ఎప్పటికి తేలుతుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ఇచ్చిన ప్రెజంటేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ సైతం అభినందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా వైదొలగింది. తొలుత తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ.. ఆ తరువాత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు.
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా.. అందుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వీటన్నింటి మించి గత కొంతకాలంగా ఆమె పార్టీతో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా సొంత పంథాలో సాగిస్తున్నరాజకీయాలను గమనిస్తే.. ఆమె వెనక ఇంకెవరో ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 24) అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయింది. అసలు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకోలేదనే చెప్పాలి. ఏవో ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో హడావుడి చేస్తున్నప్పటికీ.. పార్టీ మాత్రం అంతర్గత విభేదాలతో కూనారిల్లుతూనే ఉంది. పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడం దగ్గర నుంచి ఆ పార్టీలో ఎక్కడా ఎన్నడూ ఐకమత్యం, ఏకాభిప్రాయం కనిపించిన దాఖలాలు లేవు.
తిరుమలలో తప్పతాగి హల్ చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు చెప్పారు. అన్నమయ్య భవన్ లో శనివారం (మే 24) డయల్ యువర్ ఈవో కార్యకరమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.
జీవన విధానంలో యోగా భాగం కావాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విశాఖ రానున్న నేపథయంలో సన్నాహక కార్యక్రమాలను కూడా ఘటనంగా నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ లో చీలిక పక్కా అయిపోయిందా? కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా? అంటే.. గులాబీ పార్టీ వర్గాల నుంచి ఔననే సమధానమే వస్తోంది. నిజానికి కవిత చాలా కాలంగా సొంత కుంపటి’ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే.. కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్ ఏదో చేసి కవితను దారికి తెస్తారనే ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు, పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో ముగ్గరు తాగుబోతు ఖాకీలు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. ఇక కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండేళ్ళు అయినా అవకుండానే అట్టర్ ప్లాప్ సినిమా చూపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మూడు ముక్కల ఆటలో మునిగి తేలుతోంది. మరో వంక కాళేశ్వరం మొదలు కారు రేసు వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి.
మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సొంత తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.