అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల సంబరాలు జరుపుకుంన్నారు. ఇంతకీ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నకిలీ మద్యం వ్యవహారంలో తంబళ్లపల్లి తెలుగుదేశం ఇన్చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డిని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయడమే ఈ సంబరాలకు కారణం. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బి.కొత్తకోట జ్యోతి చౌక్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకున్నారు.
చట్టం ముందు అందరూ సమానమే అని చాటిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన జయచంద్రారెడ్డి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఉంటూ.. క్రమశిక్షణను ఉల్లంఘించి, జయచంద్రారెడ్డి నకిలీ మద్యం వ్యవహారంలో మునిగి తేలుతున్నారని కార్యకర్తలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు.
జయచంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీ కోవర్టుగా మారారని తెలుగుదేశం శ్రేణులు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ఆందోళనా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు , మంత్రి లోకేష్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయనపై నకిలీ మద్యం కేసు నమోదు కావడంతో పార్టీ హైకమాండ్ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugudesham-celebrates-jayachandra-reddy-suspenssion-from-party-39-207410.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.