తమిళ తెరపై తెలుగు రాజకీయం !

Publish Date:Jul 11, 2025

Advertisement

తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది.  ముఖ్యంగా.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన  హీరో విజయ్, ఆయన స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ పరిస్థితి ఏమిటి?  తమిళ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం ఎంత?  టీవీకే 2026 ఎన్నికల్లో ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తుంది. అధికార డిఎంకే, ప్రధాన ప్రతిపక్షం ఎఐడిఎంకేల సారథ్యంలోని కూటములలో, ఏ కూటమిని ఏ మేరకు టీవీకే ప్రభావితం చేస్తుంది?  అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ జోరుగా సాగుతోంది. నిజానికి  ఇప్పడు తమిళనాడు రాజకీయాల గురించిన ఏ చర్చ వచ్చినా..  విజయ్ ప్రస్తావన లేకుండా ముగియడం లేదనడం ఇసుమంతైనా అతిశయోక్తి కాదు.  

నిజానికి తమిళ రాజకీయాల్లో మొదటి నుంచి సినీతారల ప్రభావం బలంగా ఉంటూనే వుంది. హీరో ఇమేజ్ తో అనేక మంది ప్రముఖ హీరోలు రాజకీయ అరంగేట్రం  చేశారు. అయితే, సుక్సెస్ రేట్  చాల తక్కువ. విజయ్ కు ముందు ఐదేళ్ళ కిందట 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలహాసన్  పొలిటికల్ ఎంట్రీ  ఇచ్చారు.  ఎంఎన్ఎం (మక్కల్ నీతి మైమ్) పార్టీని స్థాపించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆయనతో సహా ఎంఎన్ఎం టికెట్ పై పోటీ చేసిన ప్రతి ప్రతి ఒక్కరూ ఒడి పోయారు. ఎంఎన్ఎం ఖాతా తెరవలేదు. చట్ట సభల్లో కాలు పెట్టాలనే కమల్ హసన్  కల అప్పుడు  తీర లేదు. చివరకు డిఎంకే’ పంచన చేరి రాజ్యసభలో అడుగుపెట్టారు. 

అయితే విజయ్ పరిస్ధితి కూడా అంతేనా.. అంటే కాక పోవచ్చని తమిళనాడు రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు.. విజయ్ రాజకీయాలను కమలహసన్  రాజకీయంతో కంటే..  మెగా స్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానంతో పోల్చవచ్చని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మెగా స్టార్’ చిరంజీవి ప్లే చేసిన రోల్..  తమిళనాడులో విజయ్ ప్లే చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ గతిని మార్చి వేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి,ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఆశించిన మేరకు సీట్లు గెలుచుకోలేదు. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.  కానీ..  16.32శాతం  ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా  శాతం  చీల్చడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ విజయానికి.. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి పరోక్షగా దోహదం చేసింది. ఆ తర్వాత మొత్తానికే చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి..  రాజ్యసభ సీటును, కేంద్రంలో మంత్రి పదవిని కానుకగా పొందారు. అది వేరే విషయం.

ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఎంట్రీ వలన.. అప్పటి  ప్రతిపక్ష  తెలుగు దేశం పార్టీ భారీగా నష్ట పోయింది. ఒకటి రెండు కాదు.. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 235 స్థానాల్లో పీఆర్పీ, ప్రతిపక్ష టీడీపీ ఓటును 10,000 కంటే ఎక్కువ చీల్చించి.. వాటిలో 147 స్థానాల్లో 20,000 మరో 92 స్థానాల్లో 30.000 ఓట్లను చీల్చింది. మరో వంక ఇంచు మించుగా 40 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం 5000 ఓట్ల కంటే తక్కువ ఓట్ల తేడాతో అప్పటి ఎన్నికలలో ఓడిపోయింది.

అదలా ఉంటే తాజా సర్వేల ప్రకారం హీరో విజయ్  పార్టీ ఓటు షేర్  16 శాతం క్రాస్ చేసింది. ఈ నేపధ్యంలో.. ఇదే ట్రెండ్ 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే,విజయ్ తమిళ చిరంజీవి అవుతారని అంటున్నారు. అయితే, విజయ్ పూర్తిగా ప్రతిపక్షం ఒటునే చీలుస్తారా? అధికార పార్టీ ఓటును కొల్లగొడతారా? అంటే..  రెండు ప్రధాన ద్రవిడ పార్టీలకు విజయన్ గండి కొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉన్నందున ఈలోగా ఏదైనా జరగచ్చని.. విశ్లేషకులు అంటున్నారు.

ఇదంతా ఒకెత్తయితే.. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా తమిళరాజకీయాలపై చెప్పుకోదగ్గ ఆసక్తి చూపుతున్నారు. నటిగా రోజాకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో హీరోయిన్ గా ఆమెకు తమిళ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పట్టారు. అంతకు మించి రోజా భర్త సెల్వమణి మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు. తమిళ సినీరంగంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రోజా తమిళ రాజకీయాలపై దృష్టి సారించారని అంటున్నారు. 

గతంలో అంటే గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కొంత కాలం పాటు రోజా పూర్తిగా తమిళనాడుకే పరిమితమయ్యారు. అప్పటిలోనే ఆమె విజయ్ పార్టీలో చేరి చక్రం తిప్పుతారన్న వార్తలు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించాయి. అయితే తరువాత ఆమె యథా ప్రకారం వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాను ఒక వైపు ఏపీ రాజకీయాలలో ఉంటూనే , తన భర్త సెల్వమణిని విజయ్ పార్టీకి దగ్గర చేస్తున్నారని అంటున్నారు.  మొత్తం మీద రోజా ఏదో ఒక మేరకు తమిళ రాజకీయాలలోనూ తన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

By
en-us Political News

  
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.