తెలుగు భాష వెలుగులు పూయించిన పుణ్యమూర్తి..గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి..!

Publish Date:Aug 29, 2025

Advertisement

 

 


ఆగస్టు 29వ తేదీ ప్రతి తెలుగు పౌరుడు ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన దినం. తెలుగు భాషను తన సహజ శైలిలో, జనజీవనానికి దగ్గరగా తీసుకెళ్లిన మహనీయుడు, గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి ఈ రోజు. ఆయన తెలుగు బాషకు చేసిన కృషి కారణంగా ఆయన జయంతినే తెలుగు బాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలుగు భాష కొరకు ఇంత పాటుపడిన గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి తెలుసుకుంటే..

వ్యక్తిత్వం..

1854 ఆగస్టు 29న విశాఖపట్నం జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపంలోని పార్లకిమిడి ప్రాంతంలో జన్మించారు.  ఆయన  చిన్నతనం నుంచే తెలివితేటలతో, నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు.  ఆర్థిక ఇబ్బందులున్నా  చదువు ఆపకుండా, స్వయంగా సాధన చేస్తూ తరువాత ఉపాధ్యాయుడిగా, పండితుడిగా, సాహితీవేత్తగా వెలుగొందారు.

పాండిత్యం – ఆచరణ – సాహిత్యం..

ఆ కాలంలో తెలుగు భాష గ్రంథిక భాష ఆధిపత్యంలో ఉండేది. అది సాధారణ జనజీవనానికి దూరమై, పుస్తకాలకే పరిమితమైపోయింది. విద్యార్థులు అర్థం కాని భాషలో పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చేది. గిడుగు పంతులు దీన్ని బలంగా వ్యతిరేకించారు.  పుస్తకాలలో గ్రాంథిక బాష,   వాడుకలో మాతృ భాష ఉండటం వల్ల విద్యార్థులు సరిగా విద్యను అభ్యసించ లేకపోతున్నారని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ ఆలోచనలతోనే ఆయన వ్యావహారిక భాషా ఉద్యమం ప్రారంభించారు. తెలుగు మనుషులు తమ నిత్య జీవితంలో మాట్లాడే భాషలోనే పాఠాలు, రచనలు, విద్య జరగాలి అన్నది ఆయన వాదన. ఈ ఆలోచన అప్పట్లో పెద్ద సంచలనమే.

భాషా సంస్కరణల పితామహుడు..

వ్యావహారిక భాష ఉద్యమం – తెలుగు పుస్తకాలను, పాఠ్యాంశాలను సులభమైన వ్యావహారిక శైలిలో రాయాలని ఆయన కృషి. “భాషా గిడుగు”.. అనే బిరుదు  ఆయన చేసిన సంస్కరణల వల్లే ఆయనకు ఈ బిరుదు లభించింది.

అండమాన్‌లో ఆంధ్రులు – అక్కడి తెలుగు ఖైదీలతో మాట్లాడుతూ వారి జీవన శైలిని, భాషను ఆయన పరిశీలించి రచనలు చేశారు.

లాంబాడీల (బంజారా జనజాతి) భాష, సాహిత్యం పై పరిశోధనలు చేసి, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా గిరిజనుల గొంతుకను వినిపించారు.

ఆయన కృషి తెలుగు భాషకు తెచ్చిన మార్పు..

గ్రంథిక vs వ్యావహారిక అనే విభేదాన్ని తొలగించి, తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేశారు. విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకోవాలనే హక్కు ఆయన కృషి వల్ల సాధ్యమైంది. ఆ తరువాతి తరాల రచయితలు, కవులు, పండితులు ఆయన మార్గదర్శకత్వంలో సరళమైన తెలుగులో రచనలు చేశారు.

తెలుగు భాష గొప్పదనం..

తెలుగు భాష అతి పురాతనమైనది.  దీనికి  2,000 సంవత్సరాలకు పైగా చరత్ర ఉంది. మృదు, మధురమైన ఉచ్ఛారణ తెలుగు భాష సొంతం.

వందలాది కవులు, పండితులు, తాత్వికులు ఈ భాషను కీర్తి గగనంలో నిలిపారు. నేటి వరకు 8 కోట్లకుపైగా ప్రజలు ఈ భాషను తమ మాతృభాషగా మాట్లాడుతున్నారు.

తెలుగు భాష అందాలు కేవలం సాహిత్యంలోనే కాక, నిత్యజీవనంలో, సంస్కృతిలో, సాంప్రదాయాలలో ప్రతిఫలిస్తాయి.

గిడుగు పంతులు నేర్పినదిదే..

గిడుగు పంతులు గారు మనకు నేర్పింది ఒకే ఒక్క విషయం .. భాష అంటే ప్రజల గొంతుక. అది అందరికీ అర్థమయ్యేలా, అందరికీ అందుబాటులో ఉండాలి. తెలుగు కేవలం పుస్తకాల భాష కాదు, అది మన ఊపిరి, మన అనుభూతి, మన గౌరవం.

తెలుగు భాషకు ఓ గుర్తింపు తెచ్చి,  ఈనాడు అందరూ ఇంత సరళమైన తెలుగు భాషలో చదువుతూ, రాస్తూ అభివృద్ది వైపు నడుస్తున్నారంటే అది గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి కృషి వల్లే.. అందుకే ఆయన్ను స్మరించుకోవాలి.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.