Publish Date:Jul 26, 2022
తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చే నెల 1వ తేదీ నుంచి స్తంభించిపోనుంది. ఒక విధంగా ఇది నిర్మాతల సమ్మె పిలుపని చెప్పవచ్చు. నిర్మాతల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ షూటింగ్ లు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. దీంతో పలు సినిమాల షూటింగ్ లు నిలిచిపోనున్నాయి.
వీటిలో ప్రధానంగా ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ నిలిచిపోతుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమౌతున్న ఈ సినిమాల షూటింగ్ నిలిచిపోతే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని సినీ రంగ ప్రముఖులు చెబుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. వాటి షూటింగ్ కూడా నిలిచిపోనుంది. ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు షటింగ్ మధ్యలో ఉన్నాయి అవి కూడా నిలిచిపోనున్నాయి.
గత కొంత కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకూ షూటింగ్ లు నిలిపివేయాలని మంగళవారం జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం నిర్ణయించింది. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రేక్షకులు సినిమా ధియోటర్ కు రావడం బాగా తగ్గిపోయిందని వారంటున్నారు. దానికి తోడు టికెట్ల ధరలు, ఓటీటీ, హీరోల రెమ్యూనరేషన్ వంటి సమస్యల కారణంగా తాము చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు చెబుతున్నారు.
దీంతో ఈ సమస్యల పరిష్కారం కోసం కొంత కాలం షూటింగ్ లు నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే తమ సమస్యలు పరిష్కారమౌతాని ఆశిస్తున్నామనీ, సమస్యలు పరిష్కారమయ్యాకా యథావిధిగా షూటింగ్ లు ప్రారంభిస్తామని ఎడిటర్స్ గిల్డ్ సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugu-cinema-shootings-band-from-aug-1-25-140610.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.