పూర్వ వైభవం దిశగా తెలంగాణ తెలుగుదేశం!

Publish Date:Jun 14, 2025

Advertisement

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొంత వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో మాత్రం ఉనికి మాత్రంగానే మిగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తున్నది. తెలంగాణలో కూడా పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉందేమో కానీ కార్యకర్తల బలం మాత్రం దండిగా ఉంది. ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావనం, ఆ పార్టీపై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అంతేందుకు అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలన్న ప్రయత్నిం చేసింది. 
ఇందుకు కారణం ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండటమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో   ఉన్నారు. ఈ సంగతి పలు సందర్భాలలో సందేహాతీతంగా రుజువైంది. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం  ఒకింత ఇన్ యాక్టివ్ అయిన మాట వాస్తవమే.. కానీ ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో ఇప్పటికీ బలంగానే ఉన్నాయి.   పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ తెలంగాణ జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  2023   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడమే ఇందుకు నిదర్శనం. 

2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అత్యద్భుత విజయం తరువాత.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.  తెలంగాణలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు.  పార్టీ క్యాడర్ ఎంత బలంగా ఉన్నా.. వారిని ముందుండి నడిపించే లీడర్ కూడా అవసరమే. తెలంగాణలో ఆ నాయకత్వ కొరతే తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్యగా ఇంత వరకూ ఉంది.  ఇప్పుడు ఆ సమస్యను తీర్చడంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.అందుకే గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారిని పార్టీలోకి ఆకర్షించే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం, తదననంతర పరిణామాలతో ఆ పార్టీ బలహీనం కావడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ బలపడటానికి తెలంగాణ తెలుగుదేశం నేతలు అప్పట్లో ఆ పార్టీ గూటికి చేరడం కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. అయితే  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి, 2024 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం ఘనవిజయంతో తెలంగాణలో తెలుగుదేశంను వీడిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు.   ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయంతో తెలంగాణ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఆలా హోం కమింగ్ అంటూ తెలంగాణలో తెలుగుదేశం గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్న నేతలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఉన్నారు.  నిజానికి రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో ఇమడలేక ఉక్కపోతకు గురౌతున్న పలువురు ఇప్పుడు తెలుగుదేశం వైపే చూస్తున్నారు.  ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. 
తాజాగా గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న  కేంద్ర మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం (జూన్ 14) జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వారి మధ్య జరిగిన చర్చ ఏమిటన్నది అలా ఉంచితే.. ఈ భేటీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కానంగా నిలిచింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఓటమి తరువాత ఆయన ఫామ్ హౌస్ విడిచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అన్నిటికీ మించి కాళేశ్వరం ప్రాజెక్టు  విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన చిక్కులను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సైతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణు ఎదుర్కొంటున్నారు. ఇక కేఃసీఆర్ కుమార్తె కవిత తీరు.. ఇలా ఏ విధంగా చూసినా ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది.  అలాగే రాష్ట్రంలో  అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అంతర్గత విభేదాలతో ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో ప్రజా ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటోంది.   సరిగ్గా ఈ పరిస్థితుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో ఉన్న పలువురు మాజీ తెలుగుదేశం నేతల అడుగులు హోంకమింగ్ అంటూ తెలుగుదేశం దిశగా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.