తెలంగాణా అభివృద్ధికి భవిష్య ప్రణాళికలు ప్రకటించిన కేసీఆర్

Publish Date:Nov 25, 2015

Advertisement

 

వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఈ విజయంతో మనకి మరింత బాధ్యత పెరిగింది. ఈ విజయంతో మనం ప్రజల పట్ల మరింత వినమ్రతతో మెలగాలి తప్ప గర్వం, అహం ప్రదర్శించరాదు. తెలంగాణా ప్రజలకు తెరాస కార్యకర్తలు ఒక రక్షణ కవచంలా ఉండాలి. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును చూసిన తరువాత అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్ల ప్రదర్శిస్తున్న అసహనాన్ని తగ్గించుకొని, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి, అని అన్నారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేసారు.

 

తమ ప్రభుత్వం త్వరలో ఎదుర్కోవలసిన మూడు ప్రధాన సవాళ్ళను ఆయన వారికి వివరించారు. 1. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలు 2. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు. 3 రాష్

 

ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం. అలాగే అయన తన భవిష్య ప్రణాళికలను కూడా వారికి వివరించారు. త్వరలో తను రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టి, కనీసం వారం రోజుల పాటు అన్ని జిల్లాలలో పర్యటించి మారుమూల గ్రామాలలో ఉన్న పార్టీ నేతలను, కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. ఆ సందర్భంగా ఆయా జిల్లాలలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల సమీపంలోనే తను బస చేసి వాటి పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. వచ్చే నాలుగేళ్ళలో అన్ని ప్రాజెక్టుల నుండి నీళ్ళు తరలించేందుకు అవసరమయిన వ్యవస్థలు ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.

 

త్వరలోనే డి.ఎస్.స్సీ. పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ కళాశాలలో 15,000-20,000 మంది టీచర్ల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా డి.ఎస్.స్సీ-98 బ్యాచ్ లో అర్హులయిన 1,500 మందిని ఉద్యోగాలలోకి తీసుకొంటామని తెలిపారు. రెండు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి పర్మనెంట్ చేస్తామని తెలిపారు.

 

ఎన్నికల హామీల అమలులో భాగంగా ఈ ఏడాదిలో 60,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను, వచ్చే ఏడాది చివరికి లక్ష ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కొత్త ప్రతిపాదన చేసారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో ఏడాదికి రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారందరికీ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించాలనుకొంటున్నట్లు తెలిపారు. అందుకోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడి కేంద్రప్రభుత్వం తరపున మరిన్ని ఇళ్ళు తెలంగాణా రాష్ట్రానికి కేటాయించవలసిందిగా కోరుతానని తెలిపారు. తద్వారా ఒక్కో ఇంటికి కేంద్రం తరపున 2 లక్షల సబ్సీడీ లభిస్తుందని అన్నారు.

 

ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల కారణంగా 2018 నాటికి తెలంగాణా రాష్ట్రం మిగిలు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుండి ఖరీఫ్ సాగుకు పగలు 9గంటల పాటు విద్యుత్ అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలలోగా ప్రతీ ఇంటికి త్రాగు నీరు అందించలేకపోయినట్లయితే తాము ప్రజలను ఓట్లు అడగబోమని మళ్ళీ మరో మారు ప్రకటించారు.

 

కళ్యాణ లక్ష్మి పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 51,000 ఆర్దికసహాయాన్ని వచ్చే మార్చి నుండి రాష్ట్రంలో నిరుపేదలందరికీ అందించబోతున్నట్లు ప్రకటించారు. మంత్రులు తమ తమ నియోజక వర్గాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం చెల్లింపులు చేసేందుకు వచ్చే ఏడాది బడ్జెట్ లో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింద ఒక్కో మంత్రికి రూ.25 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.