అధికారంలో ఉన్న జాగ్రత్తగా ఉండాలంటున్న కేటీఆర్...

Publish Date:Dec 28, 2019

Advertisement

మున్సిపల్ ఎన్నికల షడ్యూల్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ నేతల్లో జోరు పెరిగింది. అధికారంలో ఉన్నాం కదా అని మున్సిపల్ ఎన్నికల్ని లైట్ తీసుకోవద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపోల్స్ లో క్లీన్ స్వీప్ చేసేందుకు ఇన్ చార్జిలను కూడా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా మునిసిపాలిటీల్లో వారు పర్యటించి అక్కడ తాజా పరిస్థితి పై ఈ నెలాఖరు లోపు నివేదిక రూపంలో ఇవ్వా లని టీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆదేశించారు.

ప్రతివార్డుకి ముగ్గురు ఆశావహుల పేర్లు ఇవ్వా లని కెటిఆర్ సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు ఉంటే ఆయన చేర్చుకోవాలన్నారు. అనుకోకుండా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తమకేదో బలం ఉందని ఊహించుకుంటోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు నడవబోతున్నారు. మతాల్ని రెచ్చగొట్టా లని అనుకుంటున్న బీజేపీని ప్రజలు సహించబోరని కేటీఆర్ తెలియజేశారు. ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని కొత్తగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు.

తెలంగాణ భవన్ లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది మంత్రులు పార్టీ ప్రధాన కార్య దర్శులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టిఆర్ ఎస్ కు పట్టం కట్టారని కెటిఆర్ గుర్తు చేశారు. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు గా ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు.తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. తాము నేల విడిచి సాము చేయడం లేదన్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎజెండాగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ఆరు లక్షల మందికి కేసీఆర్ కిట్ అందించామని, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్టు చెప్పారు.

ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.అంతే కాక కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ముస్లిం లను మినహాయిస్తే తాము బిల్లుకు వ్యతిరేకం కాదని చెప్పారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తమ పార్టీ రాజకీయ పార్టీ కాదని ప్రజలకు మేలు చేసే పార్టీ అని తెలియజేశారు. పార్లమెంట్లో పౌరసత్వ బిల్లును తాము వ్యతిరేకించడం పై స్పష్టతనిస్తూ తాము అన్నొ బిల్లులను సమర్ధించామని తాజగా పెట్టిన ఆర్టికల్ 370 బిల్లును కూడా సమ్ర్ధించినట్లు తెలియజేశారు.తాజా బిల్లులో ముస్లింలను మినహాయించి అని రూపొందించిన బిల్లును తాము సమ్మతించమని ఆ మాటలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.ముస్లింలను కూడా ఈ బిల్లులోచేరిస్తే తాము కూడా ఈ బిల్లుకు అనుకూలంగా సభలో అనుకూలంగా ఓట్లు వేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.