మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి
Publish Date:Feb 13, 2026
Advertisement
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. పట్టణ ఓటర్లు కాంగ్రెస్కు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ సత్తా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో సీపీఐ 22 సీట్లు సాధించి కాంగ్రెస్తో సమానంగా నిలిచింది. కాంగ్రెస్ కూడా 22 డివిజన్లలో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 7 స్థానాలు గెలుచుకోగా,సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 స్థానాలను దక్కించుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావు సీపీఐకి చెందినవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టి గెలిచిన ఆయన చొరవతోనే కొత్తగూడెం నగరపాలక సంస్థగా రూపుదిద్దుకుంది. ఆ కార్పొరేషన్కు జరిగిన తొలి ఎన్నికల్లోనే సీపీఐ కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించడం రాజకీయంగా విశేషంగా మారింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ హవా నల్గొండ జిల్లాలో మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండ మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులను హస్తం పార్టీ గెలుచుకుంది. అలాగే సూర్యాపేట జిల్లాలోని హుజుర్నగర్, కోదాడ, నేరేడుచర్లలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. అయితే తిరుమలగిరిలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తంగా తెలంగాణ పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్కు కొన్ని ప్రాంతాల్లో పరిమిత విజయాలు దక్కినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాలు మున్సిపల్ పీఠాలు: కాంగ్రెస్ – 64 బీఆర్ఎస్ – 15 హంగ్ – 36 ఇతరులు – 1 బీజేపీ – 0 మొత్తం వార్డులు: కాంగ్రెస్ – 1346 బీఆర్ఎస్ – 723 బీజేపీ – 261 ఇతరులు – 252
http://www.teluguone.com/news/content/telangana-municipal-elections-39-214042.html





