పులివెందులపై కన్నేసిన తెలంగాణా ఎంపి.లు !
Publish Date:Jul 25, 2012
Advertisement
తెలంగాణపై వైసిపి పార్టీ నిర్ణయం చెప్పకుండానే తెలంగాణలో ప్రవేశించిన విజయమ్మ, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకోసం చేపట్టిన ధర్నా తెలిసిందే. దీనికి ధీటుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు పులివెందులలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను వారు వైసిపి నేత జగన్ స్వంత జిల్లాలోనే చేనేత కుటుంబాల వారు వందలాదిగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు తెలసింది. ఈ పథకం రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఢిల్లీ నివాసంలో రూపు దాల్చిందని చెబుతున్నారు. ఒక వైపు చంద్రబాబు నాయుడు బిసిలకు 100 సీట్ల పథకంతో ముందుకు సాగుతున్నారని, ఇంకోవైపు రాజకీయ లబ్దికోసమే విజయమ్మ సిరిసిల్లలో ధర్నా చేసారని వీటిని త్రిప్పికొట్టాలంటే తాము కూడా ఏదైనా నిర్ణయాత్మక కార్యక్రమంతో ముందుకు సాగాలని తెలంగాణ ఎంపిలు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కడపజిల్లా జమ్మలమడుగులో పర్వటించి అక్కడి చేనేత కార్మికుల వెతలను తెలుసుకొని నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. వైకాపాకు అడ్డుకట్టవేయడానికి ఇదే సరైన పరిష్కారంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఎంపిలు భావిస్తున్నారు. ఇలా అయితేనే రానున్న 2014 ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. విజయమ్మకు ఆమె నివాసం నుండి సిరిసిల్లకు వచ్చివెళ్లటానికి అసాధారణ భద్రత కల్పించిన ప్రభుత్వం తమకు కూడా అదే స్ధాయిలోతమకు కూడా భద్రత కల్పించాలని టికాంగ్రెస్ ఎంపిలు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-mps-to-tour-pulivendula-24-15946.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





