త్వరలో మంత్రి వర్గ విస్తరణ ?
Publish Date:Jul 25, 2012
Advertisement
దేశంలోని ఏ సమస్యకైనా పరిష్కారం ప్రణబ్ ఎన్నిక తర్వాతే నని తేల్చి చెప్పిన అధిష్టానం ఇప్ఫుడు ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ దర్బారంతా రాష్ట్రపతి ప్రమాణోత్సవంలో కోలాహలంగా ఉంది. అయితే రాజస్థాన్, మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ తమ రాష్ట్రాలలో నాయకత్వ మార్పుకోసం డిల్లీలో కుస్తీపడుతున్నారు. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్నాయకులంతా ఢిల్లీలో తిష్టవేశారు. తెలంగాణ, ఆంధ్ర నాయకులు బలాబాలాలు బేరీజులో భాగంగా తెలంగాణ నుండి ముఖ్యమంత్రిగా కోరుతున్న వారిలో జానారెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ అక్కడే వున్నారు. అయితే ప్రణబ్ ప్రమాణస్వీకారంతరం అజాద్ ముఖ్యమంత్రితో బేటీ అవుతారని తెలుపుతుండటంతో రాష్ట్రంలో నాయకత్వం మారుతుందా లేక మంత్రివర్గ విస్తరణకే ప్రాధాన్యత ఇస్తారా అనేది తేలనుంది. నాయకగణం అంతా మంత్రివర్గ విస్తరణే అంటున్నారు. ఢిల్లీలో మన నేతలంతా మాట్లాడుకునే అంశం మాత్రం చిరంజీవికి త్వరలో మంత్రిస్దానం లభించబోతోందనే . ఇదివరలో రోశయ్యను మంత్రి వర్గంనుండి తొలగించేటప్పుడు కూడా ఇదే విదంగా 15 రోజుల ముందు ఢిల్లీకి పిలిపించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్ర గవర్నరు కూడా కిరణ్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ ఇక్కడి నాయకులు, మంత్రులు గవర్నర్ ను కలసిన వారు తెలియజేస్తున్నారు. ఇప్పడు గవర్నర్ కూడా అక్కడే ఉండడంతో రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠతో ఏ మార్పులు చేర్పులు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-ministry-expansion-in-few-days-24-15945.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





