Publish Date:Feb 15, 2026
ఎవరు ఎవరికి శతృవులో మితృవులో రాజకీయాల్లో చెప్పడం చాలా కష్టం. ఇటు ఏపీ అటు తెలంగాణాలో సొంతింటి బిడ్డలే ఆయా తండ్రి, సోదరులపై విరుచుకుపడుతుంటే.. అసలు సిసలైన ప్రత్యర్ధులకు పెద్దగా పని లేకుండా పోతోంది. ఏపీలో షర్మిళ రూపంలో ఆమె సోదరుడు జగన్పై తీవ్రస్థాయిలో.. నిందలూ- నిష్టూరాలు- అపవాదులు- అభిశంసనలు.. చివరికి అధికారం అతడికి సూటు కాలేదనడాలు.. ఇలా లెక్కలేనన్ని మాటలు తూటాల్లా పేలాయి.
ఇప్పుడు తెలంగాణలో కవిత రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ,మాజీ మంత్రి హరీష్రావు , మాజీ ఎంపీ సంతోష్ తదితరులకు కవిత సినిమా చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలసి తాము పోటీ చేశారు.. వారి ద్వారా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేశారు కవిత. ఎందుకంటే ఆమెకు ఇంత వరకూ ఒక పార్టీ లేదు కాబట్టి. విచిత్రమైన విషయమేంటంటే కవిత ద్వారా ఫార్వర్డ్ బ్లాక్ అన్నది ఒకటి ఉందని చాలా మందికి ఇప్పుడే తెలిసింది.
ఇదిలా ఉంటే తాను పార్టీ పెడతానని తెలిసిన వెంటనే ప్రత్యర్దులను పక్కన పెడితే.. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనను ట్రోల్ చేస్తున్నారనీ.. వారందరికీ చెప్పేదేంటంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు కవిత. సందట్లో సడేమియాలాగా.. కొందరు జాగృతి పార్టీ లీడర్లు ఏమంటున్నారంటే.. కవితక్క వచ్చే రోజుల్లో సృష్టించబోయే ప్రభంజనం ద్వార కేసీఆర్ ఆయన పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని. ఈ మాటలంటున్నపుడు కవిత కూడా ఏమీ అనలేని దుస్థితి.
తాను రాజకీయంగా ఏవో నాలుగు చిలకపలుకులు పలికి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటే వీరేంట్రా బాబూ.. నేను ఉత్తుత్తినే అన్న మాటలు నిజం చేసేలా ఉన్నారు??? అని లోలోపల అనిపిస్తున్నదా దాన్ని బయటకు అనలేని సిట్యువేషన్లో పడిపోయారు కవిత. ఆవు ఒక గట్టున నడిస్తే దూడ మరో గట్టున ఎందుకు నడుస్తుంది? ఇదీ అంతే అన్నట్టుగా మారింది పరిస్థితి.
కవితే, తన తండ్రి, ఆయన పార్టీ, ఆయన ఇతర నాయకులపై విరుచుకుపడుతుంటే.. మరి ఆమె సంస్థ కార్యకర్తలు మాత్రం ఊరుకుంటరా? బరాబర్ ఇలాగే మాట్లాతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. పాపం ఇవన్నీ విని కవితక్క లోలోన ఎంత రగిలిపోతున్నారో. ఆమె ఒక రాజకీయ అవసరం కోసం తన తండ్రీ సోదరులపై కత్తి కడితే.. దాన్ని సీరియస్ గా తీస్కున్న కార్యకర్తలనే మాటలు ఆమెకు గుండెకోతగా అంచనా వేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-jagruti-39-214118.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.