Publish Date:Feb 15, 2026
ఎవరు ఎవరికి శతృవులో మితృవులో రాజకీయాల్లో చెప్పడం చాలా కష్టం. ఇటు ఏపీ అటు తెలంగాణాలో సొంతింటి బిడ్డలే ఆయా తండ్రి, సోదరులపై విరుచుకుపడుతుంటే.. అసలు సిసలైన ప్రత్యర్ధులకు పెద్దగా పని లేకుండా పోతోంది. ఏపీలో షర్మిళ రూపంలో ఆమె సోదరుడు జగన్పై తీవ్రస్థాయిలో.. నిందలూ- నిష్టూరాలు- అపవాదులు- అభిశంసనలు.. చివరికి అధికారం అతడికి సూటు కాలేదనడాలు.. ఇలా లెక్కలేనన్ని మాటలు తూటాల్లా పేలాయి.
ఇప్పుడు తెలంగాణలో కవిత రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ,మాజీ మంత్రి హరీష్రావు , మాజీ ఎంపీ సంతోష్ తదితరులకు కవిత సినిమా చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలసి తాము పోటీ చేశారు.. వారి ద్వారా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేశారు కవిత. ఎందుకంటే ఆమెకు ఇంత వరకూ ఒక పార్టీ లేదు కాబట్టి. విచిత్రమైన విషయమేంటంటే కవిత ద్వారా ఫార్వర్డ్ బ్లాక్ అన్నది ఒకటి ఉందని చాలా మందికి ఇప్పుడే తెలిసింది.
ఇదిలా ఉంటే తాను పార్టీ పెడతానని తెలిసిన వెంటనే ప్రత్యర్దులను పక్కన పెడితే.. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనను ట్రోల్ చేస్తున్నారనీ.. వారందరికీ చెప్పేదేంటంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు కవిత. సందట్లో సడేమియాలాగా.. కొందరు జాగృతి పార్టీ లీడర్లు ఏమంటున్నారంటే.. కవితక్క వచ్చే రోజుల్లో సృష్టించబోయే ప్రభంజనం ద్వార కేసీఆర్ ఆయన పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని. ఈ మాటలంటున్నపుడు కవిత కూడా ఏమీ అనలేని దుస్థితి.
తాను రాజకీయంగా ఏవో నాలుగు చిలకపలుకులు పలికి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటే వీరేంట్రా బాబూ.. నేను ఉత్తుత్తినే అన్న మాటలు నిజం చేసేలా ఉన్నారు??? అని లోలోపల అనిపిస్తున్నదా దాన్ని బయటకు అనలేని సిట్యువేషన్లో పడిపోయారు కవిత. ఆవు ఒక గట్టున నడిస్తే దూడ మరో గట్టున ఎందుకు నడుస్తుంది? ఇదీ అంతే అన్నట్టుగా మారింది పరిస్థితి.
కవితే, తన తండ్రి, ఆయన పార్టీ, ఆయన ఇతర నాయకులపై విరుచుకుపడుతుంటే.. మరి ఆమె సంస్థ కార్యకర్తలు మాత్రం ఊరుకుంటరా? బరాబర్ ఇలాగే మాట్లాతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. పాపం ఇవన్నీ విని కవితక్క లోలోన ఎంత రగిలిపోతున్నారో. ఆమె ఒక రాజకీయ అవసరం కోసం తన తండ్రీ సోదరులపై కత్తి కడితే.. దాన్ని సీరియస్ గా తీస్కున్న కార్యకర్తలనే మాటలు ఆమెకు గుండెకోతగా అంచనా వేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-jagruti-25-214119.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.