ఎమ్మార్వోని కాదు ఇక పీఆర్వోని కలవాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో కొత్త పద్ధతి

Publish Date:Nov 19, 2019

Advertisement

 

ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారా.. తహసీల్దార్ ఆర్డీవోలను కలవాలనుకుంటున్నారా.. అయితే ఇక పై వారిని నేరుగా కలిసే అవకాశం లేదు. తహసిల్దార్ విజయా రెడ్డి హత్య అనంతరం అధికారులకు.. ప్రజలకు.. మధ్య కొత్త వ్యవస్థ రాబోతుంది. వారి మధ్య పీఆర్వో విధానం రాబోతుంది. తహసిల్దార్ విజయరెడ్డి హత్యానంతరం ఎమ్మార్వో కార్యాలయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో పీఆర్వోలను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎన్నో సమస్యలతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే వారు నేరుగా అధికారులను కలవకుండా పీఆర్వోలను కలిసే విధానం రాబోతుంది. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మొదటగా పీఆర్వోను కలుస్తారు. తమ సమస్యలు ఎంత వరకు వచ్చిందని వారిని అడుగుతారు. వారి వినతి పత్రాలను పీఆర్వోలు అధికారులకు అందజేస్తారు. పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకొని ప్రజలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారు. 

పీఆర్వో విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్యలు సరిగ్గా పరిష్కరిస్తే ఎందుకు దాడులు జరుగుతాయంటున్నారు సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్.పీఆర్వో వ్యవస్థను ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరమైన వార్త అలాగే ప్రజలు అధికారులు.. తోటి సిబ్బంది కూడా సహకరించాలి. సిబ్బంది కూడా ప్రజలతో సహకరించి.. ఏ సమస్య ఉన్నా క్షుణ్ణంగా వాళ్లు పరీక్షిస్తేనే ఆ సమస్య పరిష్కారమవుతుందని శీనివాస్ వెల్లడించారు. 

మరోవైపు విజయారెడ్డి హత్యానంతరం రెవెన్యూ అధికారులకు భద్రత అవసరమని ముఖ్యంగా మహిళా రెవెన్యూ ఆఫీసర్లకు భద్రత తప్పనిసరి అంటున్నారు. ఇంకో వైపు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులకు , మళ్లీ పీఆర్వోలు ఎందుకంటున్నారు మరికొంతమంది అధికారులు. ప్రజా సమస్యలు పరిష్కరించడం కొరకు నియమితులైన అధికారులు వాటిని పరిష్కరించకుండా పీఆర్వో వ్యవస్థ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు.ప్రజల మనస్తత్వం మారనంత వరకు ఎంత సెక్యూరిటీ ఎన్ని చట్టాలు వచ్చినా ఉపయోగం లేదు అంటున్నారు మరికొందరు అధికారులు. వ్యవస్థలోని కొన్ని లోపాలు కూడా దీనికి కారణమంటున్నారు.

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.