Publish Date:Oct 15, 2019
ఆర్టీసీ సమ్మె అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి దాకా కార్మిక సంఘాల కార్యాచరణ, ప్రతిపక్ష పార్టీల మద్దతు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ సమ్మె ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా తీయడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న గవర్నర్ తమిళ సాయిని కలిసి సమ్మెకు సంబంధించిన వివరాలు అందజేశారు. వెంటనే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపందింది. సమ్మె వివరాలతో వెంటనే ఢిల్లీకి రావాలంటూ కేంద్ర హోంశాఖ గవర్నర్ కి సందేశాన్ని పంపించింది. దీంతో గవర్నర్ తమిళ సాయి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని మోదీ, సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో గవర్నర్ సమావేశం అవుతారు. ఆర్టీసీ సమ్మె, ఆత్మహత్యలూ రాష్ట్రంలోని పరిస్థితుల్నే గవర్నర్ కేంద్రానికి వివరించే అవకాశం కనిపిస్తోంది.
ఇటు ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆయన ఇవాళ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేకే ప్రగతి భవన్ కు బయల్దేరి వెళ్లనున్నారు. సమ్మెకు సంబంధించిన విషయాలపైనా ఆయన కేసీఆర్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాను సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలియజేశారు కేకే. ఇటు ఆర్టీసీ జేఏసీ కూడా కేకే మధ్యవర్తిత్వాన్ని అహ్వానించారు. దీంతో సీఎంతో భేటీ తర్వాత కేకే ఆర్టీసీ జేఏసీ నేతలతో కూడా మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్ట్, ఇటు ఆర్టీసీ సంఘాలు కూడా ఆత్మహత్యలపై కోర్టుకు నివేదిక ఇవ్వనున్నాయి .ఇటు సమ్మె, ప్రజల సమస్యల పై ఇవాళ మరో పిటిషన్ కూడా హై కోర్టులో దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.అసలు ఈ సమ్మే పై చర్చ సఫలం కానుందా లేదా అనేది వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-governor-tamilisai-to-meet-with-pm-modi-and-amit-shah-over-tsrtc-strike-25-90092.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.