జూన్ 2 సంచలనాలకు వేదిక కానుందా?

Publish Date:May 28, 2025

Advertisement

తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలితంగా..  అమరవీరుల త్యాగాల ఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  రోజు, జూన్ 2. అవును తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలా ఘనంగా జరుపుకుంటారు.  రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను తలచుకుని, నివాళులు అర్పిస్తారు. అలాగే, ప్రభుత్వ,  ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు వివిధ, కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తెలంగాణ ఇంటింటి పండగ జరుపుకుంటుంది.

ఇదంతా 2014 నుంచి ప్రతి ఏటా జరుగతున్నదే.. కానీ ఈ సంవత్సరం జూన్ 2 న అంతకు మించి ఏదో జరుగుతందని, సంచలన నిర్ణయాలు ఉంటాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కూడా ఏదో ఒకటి, ఆరా కాదు ఏకంగా మూడు సంచలన నిర్ణయాలకు స్కోప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. 
అందులో మొదటిది  ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న, ఇప్పటికే ఎన్నో సార్లు పీటల వరకు వచ్చి ఆగిపోయిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ. జూన్ మొదటి వారంలో ఉంటుందని ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో.. మంత్రి వర్గ విస్తరణ జూన్ 2  నే ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణకు సంబంధించినంత వరకూ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2కు మించిన మంచి ముహుర్తహం మరొకటి ఉండదు. సో .. అసలంటూ, మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే జూన్ 2 నే ఉంటుందని  ఆశావహులు రెడీ అవుతున్నారు. అలాగే అదే రోజున తెలంగాణ పీసీసీ పూర్ణ కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ ముహుర్తహం అయినా, పీసీసీ ప్రమాణ స్వీకార ముహూర్తం అయినా  ఈ నెల 30న ఢిల్లీలో జరిగే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 

అదలా ఉంటే.. తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషించిన  బీఆర్ఎస్ (టీఆర్ఎస్) లో ఏ  రాజకీయ తుపాను. మరింత బలపడి జూన్ 2 న కొత్త టర్న్ తీసుకుంటుందని  అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే తెలంగాణ ఇంటి పార్టీ,  బీఆర్ఎస్ అధికారికంగా రెండుగా చీలడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.  లేఖాస్త్రంతో తిరుగుబాటు జెండా ఎగరేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె  కల్వకుట్ల కవిత  రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే  తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ,  అదే రోజు కవిత సొంత పార్టీ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనీ  పరిశీలకులు భావిస్తున్నారు.  ఇటు పార్టీని అటు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేందుకు కేసీఆర్  నెరపిన  రాయబారం కూడా విఫల కావడంతో..  కవిత పార్టీ పెట్టడం, కాదంటే, పార్టీ ఏర్పాటు దిశగా మరో అడుగు వేయడం  ఖాయమని అంటున్నారు. అఫ్కోర్స్, గులబీ పార్టీలో ఇదే తోలో చీలిక కాదు గతంలోనూ పార్టీ చీలింది.  అయితే ఇప్పడు వస్తున్న చీలిక కేవలం పార్టీలో వస్తున్న చీలిక మాత్రమే కాదు. పార్టీ అధినేత కుటుంబంలో వస్తున్న చీలిక.  అందుకే ఈ చీలిక రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు.  

ఈ నేపథ్యంలోనే కవిత నిజంగా కొత్త పార్టీ పెడతారా? అది కూడా జూన్ 2 నే ఉంటుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.  బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అందుకే కవిత ఇక ఆ పార్టీలో ఉండాలనుకోవడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు ఈ క్రమంలోనే కవిత  పార్టీ ఏర్పాటుకు సన్నాహలు ముమ్మరం చేశారని అంటున్నారు. తెలంగాణ జాగృతి వేదికగా వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం కూడా అందులో భాగమేననిచెబుతున్నారు.  జాగృతిని విస్తరిస్తూ పలు కొత్త కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. మరో వంక ఇప్పటికే ఆమె పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కవిత అనుచరులే కాదు, బీజేపీ ఎంపీ రఘునందన రావు వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఏర్పాటు విషయంలో ఎలాగైతే.. ఇఫ్స్ అండ్ బట్స్ అంటే అయితే గియితేలు  ఉన్నాయో అలాగే కవిత పార్టీ ప్రకటన ముహుర్తహం విషయంలోనూ ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదన్నది మాత్రం వాస్తవం. మరోవంక, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారాలు నడుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది 

 ఇక రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, కవిత కొత్త పార్టీ ప్రకటన కంటే మంరిత సెన్సేషనల్ పొలిటికల్ డెవలప్ మెంట్ ఏమిటంటే..  కాంగ్రెస్ లో బీఆర్ఎస్  విలీనానికి ముహూర్తం ఖరారైందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పెట్టినరెండు ముహుర్తలలో మొదటి ముహూర్తం జూన్ 2. అయితే ఆ దిశగా కదలికలు ఏవీ కనిపించడం లేదు. అయినా, రాజకీయాల్లో ఏ క్షణానికి ఏమి జరుగునో .. ఎవరూ ఊహించలేరు.  

ఈ మూడింటికి తోడు..  జూన్ 2 నే  ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గంట కొడతారని అంటున్నారు. ఇలా .. జూన్ 2 కేవలం తెలంగాణ అవతరణ దినోత్సవం మాత్రమే కాదు.. ఇంకా చాలా సెన్సేషన్స్ కు వేదిక కానుందని అంటున్నారు. అయితే ఈ వ్యుహాగానాల్లో ఏది నిజం అవుతుందో ..ఏది కాదో వేచి చూడవలసిందే. 

By
en-us Political News

  
మొన్నామ‌ధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వ‌చ్చి ఆయ‌న బంధువుల‌ను ప‌ర‌మార్శించిన విష‌యం గుర్తుందా?  అప్పుడు కేసీఆర్ ఎంత ప్ర‌శాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన‌పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా క‌ళ్ల‌న్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి బైట్ ఇవ్వ‌లేదు.
సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో  సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు.
వైసీపీ అధినేత జగన్ సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తున్న దూకుడు విమర్శలపాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో త‌న భ‌ర్త‌ను క‌ల‌వ‌డానికి రాజ‌స్థాన్ నుంచి యూకే వెడుతున్న నూత‌న వ‌ధువు ఖుష్బూ ఒక‌రు.
విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం (జూన్ 13) అహ్మదాబాద్ చేరుకున్నారు
విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ కు చెందిన ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లోనే పని చేస్తున్నారు.
అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న పలువురు మరణించిన సంగతి తెలిసిందే.
అహ్మ‌దాబాద్ విమాన ప్రమాదంలో 8200 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్, అలాగే కోపైలట్ కో పైలట్ క్లైవ్ కుంద‌ర్ మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 298 మంది చనిపోయారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం (జూన్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన 30 సెకన్లకే.. తాము భోంచేస్తున్న సమయంలో వచ్చి మీద పడి.. తమ వారి ప్రాణాలను పట్టుకుపోతుందని వారు అస్సలు ఊహించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.