Publish Date:Dec 31, 2019
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు అనే విషయం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎస్ పదవి కోసం సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా ఇప్పుడు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉనప్పటికీ సోమేష్ కి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పరిణామాలు మారితే అజయ్ మిశ్రా ఆ పోస్టులోకి వస్తారని సమాచారం. 1984 బ్యాచ్ అధికారిగా చేసిన ఈయనకు కీలక అధికారుల మద్దతు ఉంది. అయితే 1989 బ్యాచ్ కు చెందిన సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరి సర్వీసు కూడా పరిగణలోకి రానున్నట్టు తెలుస్తోంది. అజయ్ 2020 జులైలో రిటైరవనున్నారు, సోమేష్ కుమార్ పదవీ కాలం 2023 డిసెంబర్ వరకు ఉంది. వివాదరహితుడిగా పేరుతో పాటు సీనియార్టీ పరంగానూ ప్రస్తుత సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి తరవాతి స్థానంలోఅజయ్ ఉన్నారు. ఇక సోమేశ్ ను రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో కేడర్ వేరైనా సీఎం తన విచక్షణాధికారంతో సోమేశ్ ను తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అజయ్ కి 7 నెలల సర్వీసే ఉన్నందున ఇప్పుడు ఆయనకు అవకాశమిచ్చి తరవాత సోమేష్ ను సీఎస్ చేయాలనే ప్రతిపాదన కూడా వస్తుంది.
ఈరోజు ( డిసెంబర్ 31న ) సాయంత్రం 5 గంటలకు జోషి పదవీ విరమణ చేయనున్నారు, ఈలోగా ఉత్తర్వులు వెలువడాల్సి వుంది. జోష్ కి మరో 3 నెలలు అవకాశమిస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలింది. మరోవైపు సోమేష్ కుమార్ బిఆర్కె భవన్ లో జోష్ పదవీ విరమణ కార్యక్రమ ఏర్పాట్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గంటన్నర పాటు సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హాతో భేటీ అయ్యారు. జోషితో పాటు విపత్తుల నివారణ యాజమాన్యం కార్యదర్శి బూసాని వెంకటేశ్వరరావు, శాట్స్ డైరెక్టర్ దినకర్ బాబు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒకే రోజు ముగ్గురు ఐఏఎస్ లు రిటైర్ కానుండటం ఇదే ప్రథమం. మరో 6 నెలల్లో ఐదుగురు కీలక ఐఏఎస్ లు విరమణ పొందనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cs-joshi-retirement-25-92737.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.