Publish Date:Oct 23, 2024
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ అధికారంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆయనపై ఈగ కూడా వాలకుండా తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడేశారు. కోర్టులు ఆయన అరెస్టుకు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఆయన అరెస్టే తరువాయి అన్న పరిస్థితుల్లో కూడా జగన్ ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ అన్ని ఏర్పాట్లూ చేసింది. సినీ ఫక్కీలో కర్నూలు వరకూ ఛేజ్ చేసింది. అయినా అరెస్టు చేయలేకపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అప్పట్లో అంతా భావించిన పరిస్థితి. వివేకా హత్య కేసులో కీలక పరిణామం అనివార్యం అనిపించిన ప్రతి సందర్భంలోనూ జగన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు వెళ్లేవారు. ఆయన హస్తినలో ఏం చక్రం తిప్పేవారో కానీ.. అరెస్టు తథ్యం అన్న పరిస్థితి నుంచి అవినాష్ సునాయాసంగా బయటపడేవారు.
ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. హస్తినలో ఆయన పరపతీ పూర్తిగా అడుగంటింది. ఇప్పుడు ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఆయన అరెస్టు అనివార్యమేనా, అయితే ఎప్పుడు అరెస్టౌతారు. అసలు వివేకా హత్య కేసు విచారణ ఎప్పుడు ట్రాక్ మీదకు వస్తుంది? అన్న ప్రశ్నలు రాజకీయవర్గాలలోనే కాదు.. జన బాహుల్యంలో కూడా వినిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైందన్న వార్త ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లేనన్న చర్చకు తెరతీసింది.
ఇంతకూ ఏం జరిగిందంటూ వివేకా హత్య కేసులో నిందితులుగా యాంటిసిపేటరీ బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలు తమ బెయిలు కండీషన్లు సడలించాలని కోరుతూ తెలంగాణ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఆ కోర్టు కొట్టివేసింది. తాము విదేశీ పర్యటనక వెళ్లేందుకు వీలుగా బెయిలు కండీషన్లు సడలించాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 2 వరకూ తాము జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఆ పిటిషన్ నువిచారించిన తెలంగాణ హైకోర్టు.. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సీబీఐ కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాలని కోర్లు తీర్పు చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించినా అక్కడ ఆయనకు సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని న్యాయ నిపుణులు అంటున్నారు.
వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి, వారిపై దాడులు చేసిన చరిత్ర ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ గట్టిగా అభ్యంతరం చెబుతుందని అంటున్నారు. తెలంగాణ హైకోర్టులో తన అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో అవినాష్ రెడ్డికి ఇక దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-court-reject-avinash-reddy-plea-25-187295.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.