టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వని నేతలకు అభయహస్తం అందిస్తున్న కాంగ్రెస్ , బీజేపీ

Publish Date:Dec 27, 2019

Advertisement


కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలా ఉన్న సూర్యపేట జిల్లాలో ఇప్పుడు గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వార్డుల వారీగా ఓటర్ల గణన అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాల్టీల్లో సందడి పెరిగింది. ఆ మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీనం వల్ల వార్డుల సంఖ్య పెరిగింది. సూర్యాపేట జిల్లా పరిధిలో గతంలో 100 వార్డులుండగా కొత్త మున్సిపాలిటీ చట్టం మేరకు ఆ సంఖ్య 141 కి పెరిగింది. ప్రస్తుతం సూర్యాపేటలో 48 వార్డులు, కోదాడలో 35, హుజూర్ నగర్ లో 28 తిరుమల గిరిలో 15, నేరెడుచర్లలో 15 వార్డులున్నాయి.

అన్ని చోట్ల వలస నేతలు కారణంగా అధికార టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొంటుంది.సూర్యాపేట మున్సిపాలిటీలో గతంలో 34 వార్డులు ఉండేవి 7 సమీప గ్రామాల విలీనంతో ఆ వార్డుల సంఖ్య 48 కి చేరింది. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. కానీ ఇతర పార్టీల నేతలు గులాబీ దళంలో చేరి ఆ పార్టీకి మద్దతిచ్చారు. దీంతో చైర్మన్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంది.2014 నుంచి 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లోకి వలసొచ్చారు. ఫలితంగా అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అంతకంతా పెరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకి సుమారు 5 గురు కంటే ఎక్కువ మంది కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ఆరాటపడుతున్నారు.

ప్రస్తుతం రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరాల్సిందే అన్న పట్టుదలతో ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలో అధికార పార్టీలు చాలా మంది అభ్యర్ధులుంటే విపక్ష కాంగ్రెస్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన వీరాభిమానులు సైతం గులాబీ గూటికి చేరడంతో హస్తం పార్టీకి కౌన్సిలర్ అభ్యర్థులే కొరవడ్డారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం పేరుకుపోయింది. పొరపొరులో అయినా పరిస్థితి మారుతుందేమో అని ఆ పార్టీ పెద్దలు ఆశ పెట్టుకున్నారు.సూర్యపేట జిల్లాలో 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం బాగా డీలా పడింది.

2018 ఎన్నికల్లో టిడిపి పక్షాన కోదాడ అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి విజయం సాధించారు .ఇదే జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిడిపి బరిలోకి దిగినప్పటికీ డిపాజిట్ గల్లంతయ్యింది. ఇక పొరుగూరి విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా టిడిపికి అభ్యర్ధులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిజెపికి కొంత పట్టుంది. కానీ మిగతా మున్సిపాలిటీల్లో మాత్రం కమలదళానికి ఇబ్బందికర పరిస్థితి అని తెలిసిందే.ఈ తరుణంలో టీఆర్ఎస్ లో టికెట్లు ఆశించి భంగపడే నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బిజెపిలు కాచుకోని ఉన్నాయి. ఇది పరీక్షా సమయం కనుక టికెట్లు ఆశించే వరకు ఉండి అవసరమైతే జంప్ అవ్వటానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.
 

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.