ఎటు నుంచి ఎటు చూసినా కాంగ్రెస్ కి హైపర్ యాక్టివ్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నట్టుంది చూస్తుంటే. ఇక్కడి బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఢిల్లీ వరకూ తీసుకెళ్లి.. అక్కడ సభలు- సమావేశాలు- ధర్నాలు- వగైరా ఏర్పాటు చేసి.. దీన్ని అమలు చేయకుంటే మోడీ ముక్కు నేలకేసి రాసి.. గద్దె దింపుతాం అంటూ హెచ్చరిస్తున్నారు రేవంత్. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే రేవంత్ కాంగ్రెస్ కాంగ్రెస్ సింహంలా గర్జిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరంగా చూస్తే రాహుల్ తర్వాత ఆ స్థాయిలో ఐకానిక్ లీడర్షిప్ కనిపిస్తోంది ఒక్క రేవంత్ రెడ్డిలోనే అని పరిశీలకులు అంటున్నారు.
రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమైనది ఏబీవీపీలో.. రాజకీయ పుట్టుక తీస ఏబీవీపీలో, అటు పిమ్మట కేసీఆర్ కి శిష్యుడిగానూ తయారవ్వాలని చూసి.. ఆపై టీడీపీలోకి వచ్చి.. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశంలో ఉండటం వల్ల ఉండటం వల్ల యూజ్ లేదని గుర్తించి.. కాంగ్రెస్ లో చేరారు. చేరడంతోనే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టారు. ఇదేమంత మామూలు విషయం కాదు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లలోనే హైపర్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఢిల్లీ గడ్డ మీద మోడీగా తొడగగొట్టి సవాల్ విసురుతున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సరిగ్గా ఇలానే ఉండేవారు. ఇక్కడి నుంచి అధిక మొత్తంలో ఎంపీ సీట్లు గెలిచి.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా చేశారన్న పేరు సంపాదించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా గే కనిపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆయన ప్రాతినిథ్యం వహించే తెలంగాణలో ఆ స్థాయిలో ఎంపీ సీట్ల సాధనకు స్కోప్ పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఆ దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ కి కూడా ఏమంత గొప్ప నాయకత్వ పటిమ లేదు. ఇంటా బయటా రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇందిరను పోలి ఉన్న ప్రియాంక కూడా ఏమంత గొప్ప వాయిస్ వినిపించలేక పోతున్నారు. ఆమె స్టామినా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ ఎంపీలైతే.. పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో మోడీని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి రివర్స్ లో కాంగ్రెస్ కే కౌంటర్లు వేశారు. అయితే రేవంత్ ఒక్కరే కాంగ్రెస్ లో గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. రాహుల్ ఆయన్ను ఒక్కో సారి దూరం పెడుతున్నా.. వెనకాడక రాహుల్ తోటిదే ప్రయాణం అంటూ భరోసా అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సౌత్ నుంచి రేవంత్ ఫ్లాగ్ షిప్ లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ గా మారిన దృశ్యం ఆవిష్కృతమైతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cm-revanth-reddy-flagship-leader-in-congress-from-south-25-203699.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.