ఫస్ట్ టైం కేసీఆర్‌ను ప్రశ్నించిన జగన్

Publish Date:May 2, 2016

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. అదేంటి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అవును ఇందులో అద్భుతం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన జగన్..ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మాటల్లో గులాబీ దళపతి పేరు వినపడకుండా చేశారు. రెండేళ్ల కాలంలో కనీసం ఒక్కసారి కూడా కేసీఆర్ విధానాల పట్ల జగన్ నోరు మెదపలేదు. తన పార్టీ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నప్పుడు కూడా జగన్ కిక్కురుమనలేదు. పైగా వీరిద్దరి బంధం గురించి అప్పట్లో మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. సెక్షన్-8పైనా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ జగన్, కేసీఆర్‌కు అండగా నిలిచారు. అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ పాలనపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. రైతులకు మద్దతు ధర, కరువు మండలాల ప్రకటన, రుణమాఫీ అమలు, రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు ఇలా ఏ విషయంలోనూ కేసీఆర్‌ను నిలదీసిన ఘటనలు లేవు. అలాంటి వైఎస్ జగన్ ఆశ్చర్యకరంగా కేసీఆర్‌ను ఏకీపారేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద పెదవి విప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు..ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిరసిస్తూ..మూడు రోజుల నిరసన దీక్ష చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా మనుషులు అన్నాక ఎక్కడున్నా మనుషులే..తెలంగాణలో ఉన్న వారైనా..ఏపీలో ఉన్న వారైనా ఒక్కటే." ఇక్కడున్న పాలకులు అక్కడున్న మనుషులకు తాగటానికి నీళ్లు లేకుండా చేయటానికి పూనుకోవడాన్ని ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్లమవుతాం. ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెట్టాలి" అని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు కష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఇద్దరు చంద్రుళ్లకు హెచ్చరిక పంపారు. దాంతో పాటు తెలంగాణలో తన సామాజిక వర్గం గట్టిగా ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో తన పార్టీ ప్రయోజనాలు కూడా జగన్‌ చేత కేసీఆర్ పట్ల వ్యతిరేకంగా మాట్లాడించాయి. తన విధానాల్ని ఎప్పుడూ తప్పుపట్టని జగన్ తాము చేపట్టే ప్రాజెక్ట్‌ల్ని ప్రశ్నించడంపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.