తెలంగాణా సిటిజన్ కార్డులు దేనికో

Publish Date:Jul 25, 2014

Advertisement

 

సాధారణంగా అన్ని దేశాలు తమ పౌరులకు గుర్తింపు కార్డులు ఇస్తాయి. మనదేశంలో ఇప్పటికే చాలా మందికి ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి. కానీ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పధకాలలో అవినీతికి తావు లేకుండా అర్హులయిన వారికే ప్రభుత్వ పధకాల వల్ల లబ్ది కలిగేలా చేయడం ఈ కార్డుల ప్రధానోదేశ్యం అని ప్రభుత్వం చెపుతోంది. నిజంగా అవి అందుకొరకే అవి నిర్దేశించబడినట్లయితే, వాటిని తెలంగాణా సిటిజన్ కార్డులని అనడం తప్పు. కానీ ఆవిధంగా పేర్కొనడం ద్వారా రాష్ట్రంలో తెలంగాణా ప్రజల నుండి ఇతరులను అంటే బహుశః తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజలను, వారి పిల్లలను విడదీసి ప్రత్యేకంగా గుర్తించడానికేనని అర్ధమవుతోంది.

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాస నేతలు తెలుగు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి వారిని దూరం చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణా సిటిజన్ కార్డులు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణేతరులందరిపై సెకండ్ క్లాస్ సిటిజన్లుగా ప్రభుత్వమే ముద్ర వేసినట్లుఅవుతుంది. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత ఏ ఒక్కరిమీదో ఉండదు. దేశంలో యావత్ ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు కృషి చేయాలి. కానీ స్వయంగా ప్రభుత్వమే ప్రజలను ఈ విధంగా విభజించాలని ప్రయత్నించడం హర్షణీయం కాదు.

 

రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు జరుగుతున్నపుడు తెరాస నేతలు తామేమీ దేశం నుండి విడిపోతామని కోరడం లేదు కదా? అని ప్రశ్నించేవారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ఆలోచనను ఏమనుకోవాలి? ప్రభుత్వ పధకాలు నిజమయిన, అర్హులయిన లబ్దిదారులకు చేర్చేందుకు గుర్తింపు కార్డులు జారీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో ప్రజల మధ్య దూరం పెంచడాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.

 

రాష్ట్రం విడిపోయినా తెలంగాణాలో స్థిరపడినవారి పట్ల ఎటువంటి వివక్ష ఉండబోదని, రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములా కలిసి ఉందామంటూ తెరాస నేతలు చాలా మంచి మాటలే చెప్పారు. కానీ అవ్వన్నీ ఇప్పుడు పూర్తిగా మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.