కాలుష్యం, కబ్జాలు ఇక సాగవు.. మూసీ నది ప్రక్షాళన కోసం ఉద్యమిస్తున్న బీజేపీ
Publish Date:Dec 16, 2019
Advertisement
కాలుష్యాన్ని పారద్రోలుదాం.. మూసీ నదికి జీవం పోద్దాం అంటూ పోరు బాట పట్టింది బిజెపి. నమామి మూసీ పేరుతో ముచికుందా నది ప్రక్షాళన చేయాలంటోంది. దశల వారీగా మూసీ శుద్ధి జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పింది. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్ హామీ మాటలకే పరిమితమైందని ఆరోపించింది కమలం పార్టీ. మూసీ నది ప్రక్షాళన కోసం నడుం బిగించింది కమలదళం. కాలుష్యం, కబ్జాల నుండి కాపాడాలంటూ కార్యక్రమాన్ని చేపట్టింది. మానవ తప్పిదాలు ప్రభుత్వాల నిర్లక్ష్యం ముచుకుందా నది కాలుష్యం బారిన పడిందని ఆరోపించింది. నమామి గంగా స్ఫూర్తితో నమామి మూసీ ఉద్యమాన్ని ప్రారంభించింది. మూసీ జన్మస్థానంలో బిజెపి నేతలు సంకల్పం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మూసీ నదికి పూజలు చేసి హారతి ఇచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు లక్ష్మణ్. ఈ నెల పదహారు న హైదరాబాద్ లోని బాపూఘాట్ దగ్గర, ఈ నెల పదిహెడు న సూర్యాపేటలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మూసీ సుందరీకరణ కాదని శుద్ధి కావాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ళల్లా మారుస్తామని సీఎం గొప్పలు చెప్పారని ఇంత వరకూ ఏమీ చెయ్యలేదని బీజేపీ విమర్శించింది. బిజెపి వరుస ఉద్యమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. మద్యం షాపులకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. మూసీ పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్లాన్ చేసింది కమలం పార్టీ.
http://www.teluguone.com/news/content/telangana-bjp-launches-namami-musi-campaign-39-92252.html





