తెలంగాణలో షెల్టర్ జోన్ గా బీజేపీ

Publish Date:Aug 8, 2022

Advertisement

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నేతలకు ఒక షెల్టర్ జోన్ గా మారింది. రాష్ట్రంలో పార్టీ బలోపేరుతో వలస వచ్చే వారికి తలుపులు బార్లా తెరిచేసింది.  సిద్ధాంత నిబద్ధతలు పెట్టింది పేరుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు మాత్రం ఆ నిబద్ధతకు తిలోదకాలిచ్చేసి.. తెలంగాణలో అధికారమే అసలు సిసలు సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  

ఇంత కాలం కమలం పార్టీ అంటే క్షేత్ర స్థాయి నుంచి కూడా సైద్ధాంతిక బలంతో నిర్మాణం ఉన్న పార్టీగా ఉన్న గుర్తింపు ఇప్పుడు తెలంగాణలో పూర్తిగా కనుమరుగైపోయిందనే చెప్పవచ్చు. ఇప్పడు బీజేపీలో పరిస్థితి వచ్చి చేరేవారికి తాంబూలం.. ఉన్నవారికి సున్నంలా తయారైంది. 2018 ఎన్నికలలో విజయం తరువాతా, అంతకు ముందు రాష్ట్రంలో తెరాస ఏ విధంగానైతే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల వారికి తలుపులు బార్లా  తెరిచేసిందో.. ఇప్పుడు  బిజెపి కూడా అదే పని చేస్తున్నది. ఏ పార్టీ అయినా సైద్ధాంతిక పునాది మీద బలోపేతమైతేనే  పార్టీకి ప్రజల హృదయాలలో సుస్ధిర స్థానం ఉంటుందనీ, ఏదో గెలుపు చాలు అన్నట్లు గుంపగుత్తగా నాయకులను పార్టీలోకి తెచ్చుకుంటే వచ్చి లబ్ధి తాత్కాలికమే కానీ దీర్ఘకాల ప్రయోజనాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

 అయితే బీజేపీ మాత్రం ఇతర పార్టీల్లోని అసంతృప్తులను, టికెట్ ఆశావహులను టార్గెట్ చేసి కాషాయ జెండా కిందకు తెచ్చుకుంటోందని అంటున్నారు. అలా చేసిన ఫలితమే ఇప్పుడు టీఆర్ఎస్ అంతర్గత విభేదాలతోనూ, దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ముగ్గురు నేతల మధ్య పోటీలోనూ టీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఇతర పార్టీల్లోని ఆశావాహులను, అసంతృప్తులను కాషాయం జెండా పంచన చేర్చుకుంటున్న బీజేపీ ముందు ముందు ఇప్పడు టీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.

కర్నాటక రాష్ట్రంలో ఆ పార్టీ ఎదుర్కొంటున్న అసంతృప్తి జ్వాలలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలోని కొందరు సీనియర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ తెలంగాణలో పార్టీ జెండాను మోస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వలసల వల్ల గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నారన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది.

 తెలంగాణలో బిజెపి పట్ల గతంలో కంటే ఒకింత సానుకూలతే వ్యక్తమౌతున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే అడ్డగొలు చేరికలతో ప్రజలు బీజేపీ ప్రత్యేకత కోల్పోతున్నదన్న అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నారు.  ఈ వలసల వల్ల పార్టీని అంటి పెట్టుకుని, పార్టీకి నాయకులు లేని సమయంలో  బిజెపి జెండామోసి, ఉనికిని చాటిన నాయకులకు తగిన గుర్తింపు లేకుండా పోతుందని పలువురు సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆలేరు నియోజకవర్గంలో బిజెపి అంటే నామమాత్రమే. మునుగోడులోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసిన డా. జి. మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు వచ్చాయి. ఆలేరు నియోజకవర్గంలో బిజెపి 4,967 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కాషాయరంగు పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఆ మనోహర్ రెడ్డి లేదా అక్కడే పార్టీ జెండాలు మోస్తున్న పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న మరో ఆశావాహులు టిక్కెట్టును ఆశించవచ్చు. కానీ కొత్త వారు చేరడం వల్ల అక్కడ పార్టీనే నమ్ముకుని, అంటిపెట్టుకుని ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా  నిలిచిన  సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్న ప్రజల్లో కొత్త నాయకులు పార్టీలోకి చేరడం వల్ల ఆ అభిప్రాయం కాస్త వ్యతిరేకతకు దారితీసే ప్రమాదమూ  లేకపోలేదు. ప్రత్యర్థి పార్టీలు కూడా అంతే స్థాయిలో బిజెపిలోని ఆశావాహులను, సీనియర్లను తమ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ప్రస్తుతం బలంగా ఉన్న వాతావరణం. అందునా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరింత దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసిలోని నలుగురు కార్పోరేటర్లను గులాబీ గూటికి చేర్చుకున్నది. మహబూబ్ నగర్ లో ఓబిసి నేతను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనూ రావుల శ్రీధర్ రెడ్డిని టిఆర్ఎస్ లో చేర్చుకోవడంతో పాటు ఓ సంస్థకు చైర్మన్ గా నియమించింది. ఆలేరు నియోజకవర్గంలోని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా కమలానికి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండగా.. బిజెపిలోకి మాజీలు, సీనియర్లు చేరడం వల్ల పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతుందే తప్ప గెలుపును ఖాయం చేయదనేది గత ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.

 చాలా తక్కువ ప్రాంతాల్లోనే చేరికలతో పార్టీ గెలుస్తుందే తప్ప అసమ్మతి నాయకులు, ఆశావాహులు బిజెపిలోకి చేరడం వల్ల పార్టీకి విజయాలు వాటంతట అవి వచ్చి చేరవనీ, చేరిన నాయకులకున్న పేరు, ఆ నాయకులు చేరకల అనంతరం బిజెపినే నమ్ముకుని ఉన్నవారి తీరు పార్టీ గెలుపోటములను నిర్దేశిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉప ఎన్నికలు జరిగిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు బిజెపి గెలిచింది. నిజమే. రెండూ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే అదీ నిజమే. కానీ హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ బలం కంటే అక్కడ పార్టీ టికెట్ పై నిలబడిన అభ్యర్థుల సత్తాయే మిన్న అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    టిఆర్ఎస్ విజయం సాధించిన మిగిలిన రెండు ఉప ఎన్నికలలోనూ హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లలో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి.  బిజెపి గెలిచిన రెండు ఉప ఎన్నికలలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ లు  గట్టి పోటీనిచ్చాయి.  బీజేపీ చేరికలు ఆ పార్టీకి బలం అవుతాయో, వాపుగా మిగిలిపోతాయో కాలమే తేలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.