తెలంగాణలో షెల్టర్ జోన్ గా బీజేపీ

Publish Date:Aug 8, 2022

Advertisement

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నేతలకు ఒక షెల్టర్ జోన్ గా మారింది. రాష్ట్రంలో పార్టీ బలోపేరుతో వలస వచ్చే వారికి తలుపులు బార్లా తెరిచేసింది.  సిద్ధాంత నిబద్ధతలు పెట్టింది పేరుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు మాత్రం ఆ నిబద్ధతకు తిలోదకాలిచ్చేసి.. తెలంగాణలో అధికారమే అసలు సిసలు సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  

ఇంత కాలం కమలం పార్టీ అంటే క్షేత్ర స్థాయి నుంచి కూడా సైద్ధాంతిక బలంతో నిర్మాణం ఉన్న పార్టీగా ఉన్న గుర్తింపు ఇప్పుడు తెలంగాణలో పూర్తిగా కనుమరుగైపోయిందనే చెప్పవచ్చు. ఇప్పడు బీజేపీలో పరిస్థితి వచ్చి చేరేవారికి తాంబూలం.. ఉన్నవారికి సున్నంలా తయారైంది. 2018 ఎన్నికలలో విజయం తరువాతా, అంతకు ముందు రాష్ట్రంలో తెరాస ఏ విధంగానైతే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల వారికి తలుపులు బార్లా  తెరిచేసిందో.. ఇప్పుడు  బిజెపి కూడా అదే పని చేస్తున్నది. ఏ పార్టీ అయినా సైద్ధాంతిక పునాది మీద బలోపేతమైతేనే  పార్టీకి ప్రజల హృదయాలలో సుస్ధిర స్థానం ఉంటుందనీ, ఏదో గెలుపు చాలు అన్నట్లు గుంపగుత్తగా నాయకులను పార్టీలోకి తెచ్చుకుంటే వచ్చి లబ్ధి తాత్కాలికమే కానీ దీర్ఘకాల ప్రయోజనాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

 అయితే బీజేపీ మాత్రం ఇతర పార్టీల్లోని అసంతృప్తులను, టికెట్ ఆశావహులను టార్గెట్ చేసి కాషాయ జెండా కిందకు తెచ్చుకుంటోందని అంటున్నారు. అలా చేసిన ఫలితమే ఇప్పుడు టీఆర్ఎస్ అంతర్గత విభేదాలతోనూ, దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ముగ్గురు నేతల మధ్య పోటీలోనూ టీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఇతర పార్టీల్లోని ఆశావాహులను, అసంతృప్తులను కాషాయం జెండా పంచన చేర్చుకుంటున్న బీజేపీ ముందు ముందు ఇప్పడు టీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.

కర్నాటక రాష్ట్రంలో ఆ పార్టీ ఎదుర్కొంటున్న అసంతృప్తి జ్వాలలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలోని కొందరు సీనియర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ తెలంగాణలో పార్టీ జెండాను మోస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వలసల వల్ల గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నారన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది.

 తెలంగాణలో బిజెపి పట్ల గతంలో కంటే ఒకింత సానుకూలతే వ్యక్తమౌతున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే అడ్డగొలు చేరికలతో ప్రజలు బీజేపీ ప్రత్యేకత కోల్పోతున్నదన్న అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నారు.  ఈ వలసల వల్ల పార్టీని అంటి పెట్టుకుని, పార్టీకి నాయకులు లేని సమయంలో  బిజెపి జెండామోసి, ఉనికిని చాటిన నాయకులకు తగిన గుర్తింపు లేకుండా పోతుందని పలువురు సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆలేరు నియోజకవర్గంలో బిజెపి అంటే నామమాత్రమే. మునుగోడులోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసిన డా. జి. మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు వచ్చాయి. ఆలేరు నియోజకవర్గంలో బిజెపి 4,967 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కాషాయరంగు పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఆ మనోహర్ రెడ్డి లేదా అక్కడే పార్టీ జెండాలు మోస్తున్న పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న మరో ఆశావాహులు టిక్కెట్టును ఆశించవచ్చు. కానీ కొత్త వారు చేరడం వల్ల అక్కడ పార్టీనే నమ్ముకుని, అంటిపెట్టుకుని ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా  నిలిచిన  సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్న ప్రజల్లో కొత్త నాయకులు పార్టీలోకి చేరడం వల్ల ఆ అభిప్రాయం కాస్త వ్యతిరేకతకు దారితీసే ప్రమాదమూ  లేకపోలేదు. ప్రత్యర్థి పార్టీలు కూడా అంతే స్థాయిలో బిజెపిలోని ఆశావాహులను, సీనియర్లను తమ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ప్రస్తుతం బలంగా ఉన్న వాతావరణం. అందునా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరింత దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసిలోని నలుగురు కార్పోరేటర్లను గులాబీ గూటికి చేర్చుకున్నది. మహబూబ్ నగర్ లో ఓబిసి నేతను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనూ రావుల శ్రీధర్ రెడ్డిని టిఆర్ఎస్ లో చేర్చుకోవడంతో పాటు ఓ సంస్థకు చైర్మన్ గా నియమించింది. ఆలేరు నియోజకవర్గంలోని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా కమలానికి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండగా.. బిజెపిలోకి మాజీలు, సీనియర్లు చేరడం వల్ల పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతుందే తప్ప గెలుపును ఖాయం చేయదనేది గత ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.

 చాలా తక్కువ ప్రాంతాల్లోనే చేరికలతో పార్టీ గెలుస్తుందే తప్ప అసమ్మతి నాయకులు, ఆశావాహులు బిజెపిలోకి చేరడం వల్ల పార్టీకి విజయాలు వాటంతట అవి వచ్చి చేరవనీ, చేరిన నాయకులకున్న పేరు, ఆ నాయకులు చేరకల అనంతరం బిజెపినే నమ్ముకుని ఉన్నవారి తీరు పార్టీ గెలుపోటములను నిర్దేశిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉప ఎన్నికలు జరిగిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు బిజెపి గెలిచింది. నిజమే. రెండూ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే అదీ నిజమే. కానీ హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ బలం కంటే అక్కడ పార్టీ టికెట్ పై నిలబడిన అభ్యర్థుల సత్తాయే మిన్న అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    టిఆర్ఎస్ విజయం సాధించిన మిగిలిన రెండు ఉప ఎన్నికలలోనూ హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లలో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి.  బిజెపి గెలిచిన రెండు ఉప ఎన్నికలలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ లు  గట్టి పోటీనిచ్చాయి.  బీజేపీ చేరికలు ఆ పార్టీకి బలం అవుతాయో, వాపుగా మిగిలిపోతాయో కాలమే తేలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయాల్లో విలువలు పడిపోయాయి..అవనిగడ్డ ఎమ్మెల్యే ఆవేదన..!
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.