క్లైమక్స్ సీన్లలో ప్రజాప్రతినిధుల ఓవర్ యాక్షన్

Publish Date:Dec 16, 2013

Advertisement

 

 ఈరోజు మన ప్రజాప్రతినిధులు శాసనసభలో, శాసనమండలిలో, బయట కూడా వ్యవహరించిన తీరు వారి అసలు ప్రవర్తనకి అద్దం పడుతోంది. రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుండి ఉభయ సభలలో యుద్దవాతావరణం నెలకొంది. అది ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొనే వరకు కూడా వెళ్ళింది. సభ్యులందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యినందునే ఆవిధంగా వ్యవహరిస్తున్నరనుకోవడానికి వీలులేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాగిన వారి పోరాటం, తమ తమ ప్రాంత ప్రజల దృష్టిని ఆకర్షించడానికే!

 

నిజానికి ఉభయ సభలలో బిల్లుపై చర్చమొదలుపెట్టి ఉండి ఉంటే, రాష్ట్ర విభజనపై ప్రజాభిప్రాయం చట్టసభలలో వ్యక్తమయ్యేది. కానీ మన ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి చట్టసభలలో అద్దం పట్టే కంటే తమ తమ పార్టీల వ్యూహాల మేరకే నడుచుకోవాలని భావించడంతో అందరూ ఈ క్లైమాక్స్ సీన్లలో అందరూ కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. ఆవిధంగా చేస్తూ తమ పార్టీ సభ్యులే ఎక్కువ నిజాయితీగా, వీరోచితంగా పోరాడారని ప్రజలకు నిరూపించుకోవాలనే యావ వారిలో ప్రస్పుటంగా కనబడుతోంది.

 

బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భావించడం సహజం. ఈవారంతో ముగిసే శాసనసభ శీతాకాల సమావేశాలలో ఎట్టి పరిస్థితుల్లో బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకొని, మళ్ళీ శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి అప్పుడు కూడా వీలయినంత కాలం చర్చను పొడిగించగలిగితే సకాలంలో బిల్లు పార్లమెంటుకి చేరకుండా అడ్డుకోవచ్చని వారి ఉద్దేశ్యం కావచ్చు.

 

కానీ, బిల్లుపై వెంటనే చర్చ జరగాలని, వీలయినంత త్వరగా రాష్ట్రపతికి తిప్పి పంపాలని భావిస్తున్న తెలంగాణా ప్రజాప్రతినిధులు ఉభయ సభలలో బిల్లుపై చర్చ జరిగేందుకు సానుకూల వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయకుండా వారు కూడా సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో సమానంగా సభలో ఎందుకు రభస చేస్తున్నారు? అనే ధర్మసందేహం ఎవరికయినా కలగడం సహజం. వారు కూడా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఎత్తులకి పైఎత్తులు వేస్తూ, వ్యూహాత్మకంగానే ఆవిధంగా వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.

 

ఉభయ సభలలో బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండా మరికొన్ని రోజులు అడ్డుకొంటూ యుద్దవాతావరణం కల్పించి, ఇక సభ నిర్వహణ అసాధ్యమని స్పీకర్ భావించేలా ఒత్తిడి తేగలిగితే, బిల్లుపై ఎటువంటి చర్చచేయకుండానే  ఆయన ఇక్కడి పరిస్థితి వివరిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన గడువుకంటే చాలా ముందుగానే బిల్లును రాష్ట్రపతికి త్రిప్పి పంపేసే అవకాశం ఉంది. ఆవిధంగా జరిగితే బిల్లుపై ఎటువంటి అభిప్రాయాలు నమోదు చేయబడలేదు కనుక ఇక రాష్ట్రపతి కూడా ఆ బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉండదు. ఆయన వెంటనే బిల్లును క్యాబినెట్ కు పంపితే అది అక్కడి నుండి పార్లమెంటుకు త్వరత్వరగా పరుగులు తీస్తుందని తెలంగాణా ప్రజాప్రతినిధుల ఆలోచన కావచ్చును.

 

కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక సున్నితమయిన అంశంపై నిశితంగా స్పందించి, బిల్లులో లోటుపాట్లను గుర్తించి ఇరుప్రాంతాలకి నష్టం కలగకుండా శ్రద్ద వహించాల్సిన మన ప్రజా ప్రతినిధులు ఈవిధంగా తమ తమ పార్టీల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ఉన్న కొద్దిపాటి అమూల్యమయిన సమయాన్ని దుర్వినియోగం చేయడం అవివేకం.

 

ఇప్పుడు బిల్లులో లోటుపాట్లను గుర్తించి తగు సవరణలను ప్రజా ప్రతినిధులు చేయకపోతే, ఆ బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నపటికీ, అది యధాతధంగా పార్లమెంటుకి వెళ్ళిపోవడం ఖాయం. దానివల్ల ఇరుప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

 

ఇంతవరకు ఈ రాష్ట్ర విభజన వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన వ్యక్తులెవరికీ కూడా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కానీ, అభిప్రాయలు వ్యక్తం చేసే అవకాశం గానీ పొందలేదు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు ఈవిధంగా దుర్వినియోగం చేయడం అంటే తమని ఎన్నుకొన్న ప్రజలను అపహాస్యం చేయడమే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.