తెలంగాణా బిల్లుకి రెండు ప్రధాన అవరోధాలు

Publish Date:Feb 2, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకోవడంతో, రాష్ట్ర రాజకీయ నేతలందరూ విభజనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టడంతో, చివరికి ఇది ఏవిధంగా ముగుస్తుందనే ఉత్కంట ప్రజలందరిలో నెలకొంది. ఇప్పుడు రెండు ప్రధాన అంశాలు బిల్లు భవితవ్యం తేల్చనున్నాయి. మొదటిది బిల్లుకి న్యాయ, రాజ్యాంగపరమయిన చిక్కులు. రెండు పార్లమెంటులో బిల్లుకి మద్దతు కూడగట్టడం.

 

మొదటి సమస్యను కాంగ్రెస్ అధిష్టానంతో సహా అందరూ చాల తేలికగా కొట్టిపరేస్తున్నపటికీ, శాసనసభ చేత తిరస్కరించబడిన బిల్లుని ముందుకు తీసుకువెళ్ళడం కష్టమే. మొట్ట మొదట రాష్ట్రపతే దానిపై న్యాయ సలహా కోరవచ్చును. హోంశాఖ వివరణ కోరవచ్చును. అది సంతృప్తికరంగా లేకుంటే బిల్లుని త్రొక్కి పట్టవచ్చును లేదా బిల్లుపై వచ్చిన అభ్యంతరాలను సవరణలను అన్నిటినీ సరిచేయమని కేంద్రానికి త్రిప్పి పంపవచ్చును.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేక మంది ప్రతిపక్ష నేతలు ఆయనను కలిసి బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నపుడు, ఆయన వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా లోపభూయిష్టమయిన బిల్లుపై ఆమోదముద్రవేసి కేంద్రానికి అందజేస్తారని భావించలేము. ఆయన ప్రతిస్పందన చూసిన తరువాత బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషను వేస్తామని ఇప్పటికే తెదేపా నేత సుజన చౌదరి ప్రకటించారు. వారేగాకుండా ఇంకా లగడపాటి రాజగోపాల్ వంటి వారు అనేకమంది కోర్టులో పిటిషన్లు వేయవచ్చును. గతంలో వారు కోర్టులో పిటిషన్లు వేసినప్పుడు కేంద్రం అధికారికంగా రాష్ట్ర విభజన ప్రకటించినప్పుడు కోర్టుని ఆశ్రయించవచ్చని సూచించినందున ఇప్పుడు వారు వేసే పిటిషన్లను కోర్టు తప్పకుండా స్వీకరిస్తుంది. అంటే బిల్లుకి రాజ్యంగ, న్యాయపరమయిన అడ్డంకులు ఉన్నాయని స్పష్టమవుతోంది.

 

ఇక ఒకవేళ బిల్లు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి పార్లమెంటుకి చేరుకోగలిగినట్లయితే, అమోదం పొందేందుకు బీజేపీ, ప్రతిపక్షాల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో వివిధ పార్టీల బలాబలాలు ఈవిధంగా ఉన్నాయి.

 

లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్య:533, కాంగ్రెస్ మిత్ర పక్షాల సంఖ్య:247. లోక్ సభలో బిల్లు అమోదంపొందానికి అవసరమయిన కనీస సభ్యుల సంఖ్య:267. అంటే లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు మరో 20మంది ఇతర పార్టీల సభ్యుల మద్దతు అవసరం ఉంటుందన్నమాట. శివసేన (11), తృణమూల్ కాంగ్రెస్ (19), సమాజ్ వాది పార్టీ (22) బిల్లుకి మద్దతు ఈయబోమని స్పష్టం చేసాయి.

 

వీరిలో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమికి బయట నుండి మద్దతు ఇస్తోంది గనుక, ఆమేర అంటే 22 సభ్యుల మద్దతు తగ్గినట్లు భావించవచ్చును. అయితే సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ ప్రతిపాదించిన అనేక బిల్లులను కూడా గతంలో తీవ్రంగా వ్యతిరేఖించి, ఆఖరి నిమిషంలో మద్దతు ఈయడమో లేదా వాకవుట్ చేసి దానికి సహకరించడమో చేసింది. గనుక ఆ పార్టీ మాటలను విశ్వసించడం కష్టం.

 

ఇక కాంగ్రెస్ కు బయట నుండి మద్దతు ఇస్తున్న బీ.యస్.పీ. (21) చిన్న రాష్ట్రాలను కోరుకొంటోంది గనుక బిల్లుకి మద్దతు ఈయవచ్చును. ఒకప్పటి కాంగ్రెస్ మిత్రపక్షమయిన డీ.యం.కే. త్వరలో యూపీయే కూటమికి గుడ్ బై చెప్పలనుకొంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు బిల్లుకి మద్దతు ఇస్తాయో లేదో చివరి నిమిషం వరకు అనుమానమే. ఇక జయలలిత అధ్వర్యంలో నడుస్తున్న ఏ.ఐ.ఏడీ.యం.కే. (9) తమిళనాడులో ప్రత్యేక రాష్ట్రాల కోసం వస్తున్నడిమాండ్స్ ను నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది గనుక, బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చును. అయితే, లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ అధిష్టానం బిల్లుని ఏదోవిధంగా ఆమోదింపజేయగలదు. కానీ రాజ్యసభలో మాత్రం కష్టమవుతుంది.

 

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య: 242. కాంగ్రెస్:72; బీజేపీ: 47. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 121 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే కాంగ్రెస్ పార్టీకి మరో 49 మంది సభ్యుల మద్దతు ఆవసరం. అంటే బీజేపీ మద్దతు తప్పనిసరి అన్నమాట. అందుకే బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో రకరకాలుగా మాట్లాడుతోంది. రాజ్యసభలో మిగిలిన 123 సభ్యులలో కాంగ్రెస్ పార్టీ మరో 49 మంది మద్దతు కూడా గట్టగలిగితేనే  అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందగలదు. కానీ,ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడా గట్టలేకనే బీజేపీ మద్దతు గురించి కాంగ్రెస్ పదేపదే మాట్లాడుతోందని గనుక రాజ్యసభలో బిల్లు ఆమోదం దాదాపు అసాధ్యమేనని స్పష్టమవుతోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.