తెదేపాను దెబ్బ తీయడానికే సభలో తీర్మానమా?

Publish Date:Jul 3, 2013

Advertisement

 

విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, అందరూ కలిసి తెలుగు తల్లిని బలిపీఠం మీదకు ఎక్కిస్తున్నారని, ఆమె మెడపై ఇప్పుడు విభజన కత్తి వ్రేలాడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. దీనికంతటికి ప్రధాన కారణం తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఈయడమేనని ఆయన ఆరోపిస్తున్నారు. త్వరలో శాసనసభలో తెలంగాణాపై తీర్మానం పెట్టినప్పుడు తెదేపా గనుక, తెలంగాణా తీర్మానానికి వ్యతిరేఖంగా ఓటువేసి ఓడిస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చునని ఆయన అన్నారు. ఒకవేళ అప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోతే తానూ రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.

 

ఆయన మాటలు వింటే, రాష్ట్ర విభజన పట్ల ఆయన చాల ఆవేదన చెందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, నిజానికి ఆ బాధకంటే తెదేపాను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఆలోచనే ఎక్కువగా ఉంది. అందుకే ఆయన శాసనసభలో తెలంగాణకు వ్యతిరేఖంగా ఓటేయమని తెదేపాను కోరుతున్నారు. తద్వారా, తెదేపా తెలంగాణకు వ్యతిరేఖమో, అనుకూలమో చెప్పక తప్పనిపరిస్థితి కల్పిస్తే, దానిని బట్టి ఆ పార్టీని అటు తెలంగాణాలో, ఇటు సీమంద్రాలో పూర్తిగా దెబ్బ తీయవచ్చుననే దురాలోచన ఉంది. ఆ ఆలోచనతోనే మొన్న దిగ్విజయ్ సింగ్ కూడా సభలో తీర్మానం పెట్టబోతునట్లు తెలిపారు.

 

అంటే, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తెలంగాణా ఇవ్వడానికి సిద్దపడుతూనే, చివరి నిమిషం వరకు కూడా ఇదే అంశంతో తన ప్రత్యర్దులను ఏవిధంగా దెబ్బ తీయాలనే ఆలోచనలు చేస్తోందని అర్ధం అవుతోంది. ఇప్పటికే, తెలంగాణా సెంటిమెంటుని తెలివిగా హైజాక్ చేసి, తెరాసను దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే పాయింటుతో తెదేపాను రెండు ప్రాంతాలలో కూడా దెబ్బతీయాలని వ్యూహం పన్నుతోంది.

 

ఇంతవరకు వచ్చిన తరువాత, ఇప్పుడు తెదేపా తెలంగాణకు అనుకూలమని చెప్పినా ఆ పార్టీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే, తామే తెలంగాణా ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొని దాని పూర్తి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయకమానరు. ఇక, సభలో తెదేపా తెలంగాణాకు అనుకూలమని చెపితే, తెదేపా వల్లే రాష్ట్రం విడిపోయిందని లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసి, సీమంద్రాలో ఆ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది.

 

తెదేపా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ కేవలం ఈ భయంతోనే ఆ పార్టీ ఇంతవరకు తెలంగాణపై తన స్పష్టమయిన వైఖరి ప్రకటించలేకపోతోంది. తెదేపా యొక్క ఈ బలహీనతనే అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే మొన్నదిగ్విజయ్ సింగ్, నిన్నలగడపాటి వంటి వారు సభలో తెలంగాణా బిల్లు పెట్టడం గురించి మాట్లాడుతున్నారు. రేపు మరికొందరు వారికి తోడయినా ఆశ్చర్యం లేదు.

 

ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలతో డబుల్ గేం ఆడుతోందని చెప్పవచ్చును. అక్కడ టీ-కాంగ్రెస్ నేతలు తామే తెలంగాణా సాధించామని చెప్పుకొని ప్రయోజనం పొందబోతుంటే, ఇక్కడ లగడపాటి, శైలజానాథ్ వంటి వారు తాము చివరి వరకు కూడా రాష్ట్ర విభజన జరగకుండా యధాశక్తిన ప్రయత్నించామని, కానీ, తెదేపా వల్లే రాష్ట్రం విడిపోయిందని, నెపం తెదేపా మీదకు నెట్టివేసి సీమంద్రాలో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 

రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ దానివల్ల కలిగే ప్రయోజనాలను మాత్రం కాంగ్రెస్ పుచ్చుకొని, దుష్పరిణామాలు తెదేపాకు అంటగట్టే ప్రయతనం చేస్తోంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దురుదేశ్యాలు లేకపోతే, ‘శాసనసభ తీర్మానం తాము పట్టించుకోవలసిన అవసరం లేదని’ దిగ్విజయ్ సింగే స్వయంగా చెప్పినపుడు, ఇక శాసనసభలో తీర్మానం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది కేవలం తెదేపాను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వేస్తున్న ఎత్తుగడే తప్ప మరొకటి కాదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.