ప్రజా సమస్యలే ఆయుధాలుగా అధికార, ప్రతిపక్షాల యుద్ధం

Publish Date:Nov 20, 2014

Advertisement

 

తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలను మరొక వారం రోజులు పొడిగించే విషయంపై చర్చించేందుకు ఈరోజు అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన బి.ఏ.సి. సమావేశం జరుగబోతోంది. అయితే ఇంతవరకు జరిగిన సమావేశాలలో తెలంగాణా రాష్ట్రాన్ని వేదిస్తున్నతీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులను కాపాడేందుకు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి సభలో ఏమయినా పరిష్కారాలు కనుగొన్నారా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఏమయినా చర్చించారా? అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. అలాగని సభలో ప్రజాసమస్యలపై లోతయిన చర్చ జరగలేదని చెప్పడానికి కూడా లేదు. వివిధ సమస్యలపై చర్చించిన ప్రజా ప్రతినిధులు వాటిపై తమకు పూర్తి అవగాహన ఉందని, వాటికి తగిన పరిష్కారమార్గాలు సూచించగల సమర్ధులని కూడా నిరూపించుకొన్నారు. అంటే సమస్యలున్నాయని అందరికీ తెలుసు. వాటిని ఏవిధంగా పరిష్కరించవచ్చో కూడా అందరికీ తెలుసని స్పష్టమవుతోంది. కానీ వారు ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు చేసే బదులు, అవే సమస్యలను ఆయుధాలుగా చేసుకొని సభలో వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలు, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడానికే తమ విలువయిన సమయాన్ని, తెలివితేటలను వినియోగించడం ప్రజల దురదృష్టమనే చెప్పుకోవలసి ఉంటుంది.

 

అధికార, ప్రతిపక్షాల వారిగా విడిపోయిన ప్రజాప్రతినిధులు ఆ సమస్యలను అడ్డుపెట్టుకొని ఒకరిపై మరొకరు ఎదురుదాడి చేసుకొంటూ సభలో తమ ప్రత్యర్ధులపై పైచేయి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించారు తప్ప ఆ సమస్యల పరిష్కారానికి చూపలేదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కే. అరుణ కనిమెట్ట అనే గ్రామంలో పెన్షన్ దక్కక అవస్థలు పడుతున్న వృద్ద దంపతుల గురించి ప్రస్తావించారు. అయితే ఆమె వారి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే బదులు, తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షలమందికి పెన్షన్లు ఇచ్చేమో గణాంకాలు వివరించే ప్రయత్నం చేయడంతో, ఆమె లేవనెత్తిన వృద్ధుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తారనుకొన్న మంత్రి కేటిఆర్ తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఐదింతలు ఎక్కువ మొత్తం పెన్షన్ ఇస్తోందని, దేశంలో కెల్లా అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తమదేనంటూ గొప్పలు చెప్పుకొన్నారు. ఆ విధంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చాలా గట్టిగా ప్రయత్నించారు తప్ప ఆ వృద్ధ దంపతుల సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు.

 

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల పట్ల అధికార, ప్రతిపక్షాలు ఇదేవిధంగా వ్యవహరించాయి తప్ప వాటి పరిష్కారానికి మాత్రం ప్రయత్నించలేదనే చెప్పక తప్పదు. బీజేపీకి చెందిన డా. లక్ష్మణ్ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చక్కటి ప్రత్యామ్నాయాలు సూచించారు. కానీ వాటిని పట్టించుకొన్నవారు లేరు.

 

ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించాలి. అధికార పార్టీ అంటే ప్రతిపక్షాల నోరు నొక్కి సభను నడిపించాలి అన్నట్లు వ్యవహరించారే తప్ప ఎవరూ కూడా తాము చర్చిస్తున్న ప్రజా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలి? అని మాట్లాడకపోవడం విచిత్రం. అటువంటప్పుడు ఈ సమావేశాలు మరో వారం రోజులపాటు పొడిగించినా దాని వలన ప్రయోజనం ఏముంటుంది? ప్రజలకు ఒరిగేదేముంటుంది?

 

ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంగా ఉన్నారనే సంగతి మరిచిపోయి, రాజకీయ పార్టీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వారికి తగిన గుణపాటం నేర్పారు. అయినా రాజకీయ పార్టీలు మేల్కొనకపోతే ప్రజలే వారిని మేల్కొలపవలసి వస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.