తెలంగాణాపైకి జగనన్నబాణం దూసుకు రాబోతోందా?

Publish Date:Sep 26, 2014

Advertisement

 

వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా నుండి ఎందుకు బయటకు వచ్చిందో అందరికీ తెలుసు. అప్పుడు వద్దనుకొన్న తెలంగాణాకే మళ్ళీ తిరిగివెళ్ళి అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలమయిన రాజకీయ శక్తిగా నిలబడటం చూసి బహుశః ఆయనకు జ్ఞానోదయం అయిఉండవచ్చును. కానీ ఆ కారణంగానే తిరిగి తెలంగాణలోకి ప్రవేశించాలని భావిస్తే మాత్రం అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లవుతుంది. ఎందుకంటే తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజనకు ముందు ఆ తరువాత నేటికీ కూడా తెదేపా తెలంగాణాలో దృడంగా నిలబడి ఉంది. కానీ, తెలంగాణా ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని చెపుతూ వచ్చిన వైకాపా రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే రాత్రికి రాత్రి తెలంగాణా నుండి బయటపడి సమైక్యరాగం అందుకొంది.

 

ఇక తెదేపాకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాలో మిత్రపక్షంగా ఉంది కనుక అక్కడ ఆ పార్టీ మద్దతు ఉంది. కానీ వైకాపాకు ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణాలో గానీ ఎన్నికల మిత్రులే తప్ప శాశ్విత మిత్రులు ఎవరూ లేరు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణాలో పునః ప్రవేశం చేసినట్లయితే తెదేపాతో పాటు కాంగ్రెస్, తెరాస, బీజేపీలను డ్డీ కొనవలసి ఉంటుంది.

 

వైకాపా తెలంగాణాను విడిచిపెడుతున్నప్పుడు, తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలను, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డున వదిలేసిపోవడంతో, వారిలో చాలా మంది తెరాసను, ఇతర పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. అందువలన తెలంగాణాలో వైకాపా దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చును. మళ్ళీ ఇప్పుడు తెలంగాణాలో పార్టీని పునర్నిర్మించుకోవాలంటే అందుకు చాలా ప్రయాసపడవలసి ఉంటుంది. అంతకంటే ముందు తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని పొందవలసి ఉంటుంది. కానీ ఆ రెండు సాధ్యం కావని చెప్పవచ్చును. ఎందువలన అంటే వైకాపా తెలంగాణా ను వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయినప్పుడే అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇక తెలంగాణాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలంటే స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా లో పర్యటించి పార్టీని నిర్మించుకోవలసి ఉంటుంది. కానీ ఆయన తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేఖంగా ఆయన చేసిన సమైక్య ఉద్యమాల కారణంగా ఆయన ఇప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడి ఉనప్పుడు స్వయంగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు.

 

బహుశః అందుకే మళ్ళీ తన అమ్ముల పొదిలో నుండి తనకు బాగా అచ్చి వచ్చిన, తను జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన ‘షర్మిల’ అనే బాణాన్ని మళ్ళీ బయటకు తీస్తున్నారు. కానీ శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా మొన్న హైదరాబాదులో ఆయన నివాసంలో జరిగిన తెలంగాణా నేతల సమావేశంలో ఖమ్మం యంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ద్వారా తెలివిగా ఆ ప్రతిపాదన చేయించారు. ‘తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కట్టబెట్టాలనే’ ఆయన ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి దానిని కాదనకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కనుక తెలంగాణపైకి ఆయన సందిస్తున్న బాణం ఎప్పుడయినా రివ్వున దూసుకు రావచ్చును.

 

అయితే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో ఉన్నారు కనుక అప్పుడు షర్మిల, విజయమ్మలు పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించ వలసి వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు బయటనే ఉన్నప్పుడు ఆయనే స్వయంగా తెలంగాణాలో పర్యటించి పార్టీని బలోపేతం చేసుకోవచ్చు కదా? తెరాస నుండి తెలంగాణా ప్రజల నుండి ఎదురయ్యే వ్యతిరేఖతను ఎదుర్కోకుండానే తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడం సాధ్యమేనా? అనే ధర్మ సందేహం చాలా మందికి కలగవచ్చును. సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ముందుగా తన నమ్మకమయిన బాణాన్ని తెలంగాణా మీదకు వదిలిపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారని చెప్పవచ్చును. ఒకవేళ ఆ బాణం ఇదివరకులాగే ఎటువంటి అడ్డంకులు లేకుండా రివ్వున తెలంగాణాలో దూసుకుపోతే, ఆ వెనుకే జగన్మోహన్ రెడ్డి తన ‘ఓదార్పు రధం’ అధిరోహించి తెలంగాణా పునః ప్రవేశం చేయవచ్చును.

 

కానీ తనకు ఎంతో బలముందని చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన ఓదార్పు రధం ఎన్నికల కురుక్షేత్రంలో క్రుంగిపోయి ఓటమి పాలయినప్పుడు, తనకు అసలు బలం లేని చోట తోడుగా ప్రజాసైన్యం కానీ, స్వంత సైన్యం గానీ లేకుండా చాలా బలంగా ఉన్న శత్రుసేనలను ఏవిధంగా జయించేద్దామని బయలుదేరుతున్నారో ఆయనకే తెలియాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.