తెలంగాణలో స్థానిక సమరం మరో వాయిదా ఖాయం అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న తెలంగాణ స్థానిక ఎన్నికలు కోర్టు స్పష్టమైన గడువు విధించిన తరువాత కూడా మళ్లీ మరో మారు వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తున్నది. వాస్తవానికి స్థానిక సంస్థల గడువు ముగిసి చాలా కాలమైంది. తెలంగాణలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వాటి గడువు ముగిసి కూడా ఏడాది దాటింది.
అప్పటి నుంచీ కూడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ఈనేపధ్యంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తాం, అప్పుడు నిర్వహిస్తామంటూ ముహూర్తాలు ఖరారు చేసి ఉజ్జాయింపుగా తేదీలనూ ప్రకటించేస్తున్నా.. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. అసలీ ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లు కనిపించదు.
ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పట్టుబడుతుండటంతో కోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఇసుమంతైనా లేదన్న విషయం దాదాపు స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణకు తగినట్లుగానే ఇటీవలి మంత్రివర్గ సమావేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించే వరకూ స్థానిక పోరుకు వెళ్లవద్దన్ననిర్ణయం తీసుకున్నది. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మరి కొంత గడువు కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అదే జరిగితే ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేనట్లేనని అంటున్నారు. ఎందుకంటే.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. వారి వద్ద నుంచి ఈ నెల 30లోగా ఎటువంటి నిర్ణయం వెలువడకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కారణాన్ని చూపుతూ కోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా బీహార్ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణ స్థానిక సమరం వాయిదా పడటమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందు కోసం కోర్టును స్థానిక పోరును మూడు నుంచి నాలుగు నెలల పాటు వాయిదా వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆ లోగా రాష్ట్రపతి లేదా గవర్నర్ నుంచి బీసీల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంతకీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో లింకేమిటంటే.. బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్నది రేవంత్ బావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కోర్టును ఆశ్రయించైనా సరే స్థానిక ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ పట్టుబ డుతుందని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telanagan-local-bodies-elections-lonk-with-bihar-assembly-25-205853.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.