Publish Date:Apr 13, 2024
పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనేది రొటీనే. అదే నక్కని చూసి పులి గోతులు తవ్వడం నేర్చుకోవడం అవసరం అంటారా? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పులిలాంటి తెలంగాణ ప్రభుత్వం నక్కలాంటి ఏపీ ప్రభుత్వం బాటలో నడవబోతోందని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాలను ఆలోచింపజేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ బుర్రలోంచి పుట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు తలెత్తాయి. ‘సేవ’ పేరుతో వాలంటీర్లుగా మారినవారు ప్రజల నెత్తిన గుదిబండలుగా మారారు. అధికార పార్టీకి అఫీషియల్ కార్యకర్తల్లా సేవ చేసి తరిస్తున్నారు.
ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న పనులన్నీ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలు ఆల్రెడీ వున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్ని వేలమంది వాలంటీర్లను నియమించడం ద్వారా ఖజానా మీద భారం పెరిగింది. ఆల్రెడీ గతంలో ఆ బాధ్యతలు నిర్వహించిన వారికి పనేం చేయకుండానే జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజాధనం రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. వాలంటీర్ల ప్రజలకు వివిధ పనులను చేసే క్రమంలో చేతివాటం ప్రదర్శించడం, కొందరు వాలంటీర్లు ప్రజల మీద దాడులు చేయడం లాంటి వార్తలు కూడా చదివాం. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా వివాదాలకు కేంద్రబిందువుగా మారిన వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలో కూడా ప్రారంభించడం అనేది కోరి కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ముందుకే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ‘వాలంటీర్’ అనే పదం వాడకుండా ‘ఇందిరమ్మ’ కమిటీలు అనే పేరు పెట్టి వాలంటీర్ వ్యవస్థకు సమాంతరంగా వుండే వ్యవస్థను తెలంగాణలో కూడా అభివృద్ధి చేయబోతున్నట్టు అర్థమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేర్చే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి ఒక్క ఇందిరమ్మ కమిటీ సభ్యుడికి గౌరవ వేతనంగా నెలకు ఆరు వేలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇది నథింగ్ బట్ వాలంటీర్ వ్యవస్థేనని అర్థమైపోతోంది. ఒక్కో ఇందిరమ్మ కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. ఏ పథకానికైనా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వుండేది ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులను నియమిస్తారని తెలుస్తోంది. మరి ఈ కమిటీలు అమల్లోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థలాగానే తయారైతే, నిజంగానే నక్కని చూసి పులి గోతులు తవ్వుకున్నట్టే అవుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telamgana-government-to-implement-volunteers-39-173764.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.